May 23, 2024
రేవ్ పార్టీ.. ప్రస్తుతం ఏపీ తెలంగాణలో అలాగే తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎక్కడ చూసినా కూడా ఈ పేరే ఎక్కువగా వినిపిస్తోంది. అంతేకాకుండా రేవ్ పార్టీ కచ్చితంగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో సంచలనంగా మారింది. అయితే ఈ కేసులో రోజుకు ఒక కొత్త ట్విస్ట్ వెలుగులోకి వస్తోంది. ఈ కేసులో చాలా మంది టాలీవుడ్ సెలబ్రిటీలు ఉన్నారు అని వార్తలు వినిపించగా అందులో ముఖ్యంగా నటి హేమ పేరు బయటకు వచ్చిన విషయం తెలిసిందే. ఇక అందుకు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో వెంటనే నటి హేమ ఆ వార్తలపై స్పందించింది.
తాను హైదరాబాద్ లోనే ఉన్నానని, ఫామ్ హౌస్ లో చిల్ అవుతున్నట్లు ఆమె చెప్పుకొచ్చింది. అయితే ఈ వీడియో అబద్దమని హేమ చెప్పేవని అవాస్తవం అంటూ బెంగుళూరు పోలీసులు రేవు పార్టీలో అదుపులోకి తీసుకున్నవారిలో హేమ ఉన్నారంటూ ఆమె ఫోటోను రిలీజ్ చేశారు. దాంతో హేమ కథ అడ్డం తిరిగింది. ఆ తర్వాత తాను హైదరాబాద్ లోనే ఉన్నానని చెప్పుకోవడం కోసం ఇంట్లో బిర్యానీ చేస్తున్న ఒక వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆ వెంటనే బెంగుళూరు పోలీసులు రేవు పార్టీలో దొరికిన వారి వివరాలను మీడియాను వివరించారు. అందులో టాలీవుడ్ నటి ఉన్నట్టు తెలిపారు.
బెంగళూరు రేవ్ పార్టీ కేసులో దొరికిన వారి బ్లడ్ శాంపిల్స్ సేకరించి డ్రస్ తీసుకున్నరాలేదా అని టెస్ట్ కు పంపించారు. కాగా హేమ బ్లడ్ శాంపిల్స్లో డ్రగ్స్ ఆనవాళ్లు ఉన్నట్టు గుర్తించారు పోలీసులు. అలాగే తెలుగు వ్యక్తులు డ్రగ్స్ తీసుకున్నట్టు నిర్ధారణ అయ్యింది. ఇందులో సీబీఐ 98 మంది శాంపిల్స్ను సేకరించారు. నటి హేమ, ఆషీరాయ్, వాసుకు డ్రగ్స్ పాజిటివ్ వచ్చింది. అదేవిధంగా హేమ స్నేహితుడు చిరంజీవి కూడా డ్రగ్స్ తీసుకున్నట్టు తేల్చారు పోలీసులు. హేమతో పాటు పలువురికి పోలీసులు నోటీసులు పంపించారు. అయితే బెంగళూరు పోలీసుల దగ్గర హేమ డ్రామాలు బాగేనే ఆడింది. తన అసలు పేరు కృష్ణవేణిగా చెప్పింది హేమ. అసలు పేరుతోనే పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా డ్రగ్స్ కేసులో తాను లేనంటూ బుకాయిస్తూ వచ్చింది హేమ. రేవ్ పార్టీలో డ్రగ్స్ తీసుకున్నట్లు పోలీసులు పక్కాగా నిర్దారించారు. డ్రగ్స్ కేసులో పాజిటివ్ రావడంపై స్పందించింది హేమ. ఏం చేస్తారో చేసుకోండి అంటుంది హేమ. సమయం వచ్చినపుడు మాట్లాడతా అని చెప్పుకొచ్చింది. మరి ఈ విషయం ఇంకా ఎన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి మరి.
Read More: విడుదలకు సిద్ధంగా ఉన్న లవ్ మీ మూవీ.. సెన్సార్ కూడా పూర్తి చేసుకుంది!