సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్‌కు మధ్యంతర బెయిల్

December 13, 2024

సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్‌కు మధ్యంతర బెయిల్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు శుక్రవారం తెలంగాణ హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఆయన బ్లాక్‌బస్టర్ చిత్రం ‘పుష్ప 2: ది రూల్’ ప్రీమియర్ సమయంలో హైదరాబాద్‌లో జ‌రిగిన‌ తొక్కిసలాట ఘటనలో ఈ కేసు నమోదైంది. సెల‌బ్రిటీ అయిన‌ప్ప‌టికీ అల్లు అర్జున్ కి పౌరుడిగా జీవించడానికి మరియు స్వేచ్ఛను అనుభవించడానికి పూర్తి హ‌క్కు ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ తీర్పు అల్లు అర్జున్ అభిమానుల‌కి పెద్ద ఊరటగా మారింది.

ఈ మధ్యంతర బెయిల్ అల్లు అర్జున్‌కు తాత్కాలిక ఉపశమనం ఇవ్వడమే కాకుండా ఈ కేసు న్యాయపరంగా మరియు ప్రజా దృష్టిని ఆకర్షించడానికి దోహ‌ద‌ప‌డింది. అల్లు అర్జున్‌ దాఖలు చేసిన క్వాష్‌ పిటిషన్‌పై విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం నాలుగు వారాల మధ్యంతర బెయిల్‌ మంజూరు చేస్తూ ఆదేశాలు చేసింది. బన్నీ వేసిన క్వాష్ పిటిషన్​పై హైకోర్టు విచారణ జరిపింది. మధ్యాహ్నం 4 గంటల నుంచి సుమారు గంటన్నర పాటు ఇరువురు లాయర్లు తమ వాదనలు వినిపించారు. అనంతరం ఉన్నత న్యాయస్థానం అల్లు అర్జున్​కు మధ్యంతర బెయిల్ ఇస్తూ ఆదేశాలు జారీచేసింది. పూర్తిస్థాయి బెయిల్‌కు నాంపల్లి కోర్టుకు వెళ్లాలని హైకోర్టు సూచించింది.

ట్రెండింగ్ వార్తలు