December 16, 2021
‘రాధేశ్యామ్’ చిత్రం నుంచి ‘ఈ రాతలే’ పాట తర్వాత ‘సంచారి’ పాట శ్రోతల ముందకు వచ్చింది. ‘కొత్త నేలపై గాలి సంతకం…కొండగాలితో శ్వాసపంపకం’ అంటూ సాగే ఈ పాట ఓ ఫ్రెష్ ఫీల్ను ఇస్తుంది. అనిరుద్ రవిచంద్రన్ ఈ సంచారి పాటను పాడగా, జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందించారు. కృష్ణకాంత్ లిరిక్ రైటర్.ప్రభాస్ హీరోగా చేసిన ఈ పీరియాడికల్ ఫిల్మ్ ‘రాధేశ్యామ్’లో పూజాహెగ్డే హీరోయిన్గా కాగా కృష్ణంరాజు ఓ కీ రోల్ చేశారు. విక్రమాధిత్యగా ప్రభాస్, డాక్టరు ప్రేరణగా పూజాహెగ్డే, పరమహంసపాత్రలో కృష్ణం రాజు కనిపిస్తారు. రాధేశ్యామ్ చిత్రం జనవరి 14న విడుదల కానుంది