బుల్లితెర నటుడికి విడాకులు ఇచ్చిన భార్య.. నెట్టింట వీడియో వైరల్!

February 2, 2024

బుల్లితెర నటుడికి విడాకులు ఇచ్చిన భార్య.. నెట్టింట వీడియో వైరల్!

సినిమా ఇండస్ట్రీలో ప్రేమ పెళ్లి విడాకులు అన్నవి కామన్. ఏళ్ల తరబడి ప్రేమించి పెళ్లి చేసుకున్న కొందరు సెలబ్రిటీలు కొన్ని కొన్ని కారణాల వల్ల పెళ్లయిన ఏడాది రెండేళ్లకే విడిపోతూ ఉంటారు. గతంలో అలా ప్రేమించి పెళ్లి చేసుకుని ఆ తర్వాత విడిపోయిన వారు చాలామంది ఉన్నారు. అలా ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో ప్రేమ విడాకులు విడిపోవడం ఇవన్నీ కూడా ఫ్యాషన్ గా మారిపోయాయి. తాజాగా కూడా మనకు సెలబ్రిటీ జంట విడిపోయింది. ఒక సినీ నటుడికి అతని భార్య విడాకులు ఇచ్చింది.

అయితే గతంలో పారిపోయి బుల్లితెర నటుడు మునీశ్ రాజాను ప్రేమ పెళ్లి చేసుకున్న ఆమె విడిపోయినట్లు ఒకే వీడియోను రిలీజ్‌ చేసింది. ఆ వీడియోలో మునీష్ రాజా భార్య జీనత్ ప్రియ వీడియోలో మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. నేను జీనత్ ప్రియ. రాజ్‌కిరణ్ సార్ దత్తపుత్రికను. 2022లో నటుడు మునీష్ రాజాను ప్రేమ వివాహం చేసుకున్నాను. కానీ ప్రస్తుతం మేమిద్దరం విడిపోయాము. అంతే కాదు మేం విడిపోయి కొన్ని నెలలు అయ్యింది. మా పెళ్లికి ఎలాంటి చట్టబద్ధత లేదు. ఈ విషయాన్ని నేను మీతో పంచుకుంటున్నాను. నా పెళ్లితో నాన్నను చాలా బాధపెట్టాను.

అయినప్పటికీ నేను కష్టాల్లో ఉన్నప్పుడు నాకు అండగా నిలిచారు. నాకు సహాయం చేశారు. ఈ విషయంలో నన్ను క్షమించు నాన్న అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కాగా సోషల్ మీడియా ద్వారా పరిచయమైన ప్రియా, మునీష్ మొదట స్నేహితులుగా ఉన్నారు. ఆ తర్వాత పరిచయం ప్రేమగా మారింది. ప్రియా, మునీష్ రాజా కొన్నేళ్ల పాటు ప్రేమలో ఉన్నారు. అయితే వీరి పెళ్లికి మునీష్ రాజా కుటుంబం ఓకే చెప్పింది. కానీ రాజ్‌కిరణ్ మాత్రం పెళ్లిని తీవ్రంగా వ్యతిరేకించారు. మునీష్ రాజాకు తన కూతురిని పెళ్లి చేసుకునే అర్హత లేదని రాజ్‌కుమార్ అన్నారు. దీంతో రాజ్‌కుమార్‌ పెళ్లికి ఒప్పుకోకపోవడంతో చివరికి పారిపోయి మరీ పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత జీనత్ ప్రియ తన దత్త తండ్రి రాజ్‌కిరణ్‌పై పలు ఆరోపణలు చేసింది. తాజాగా భర్తతో విడాకులు తీసుకున్నట్లు వీడియో రిలీజ్‌ చేసి అందరికీ షాకిచ్చింది.

Read More: క్యాన్సర్ తో బాలీవుడ్ నటి పూనమ్ పాండే మృతి!

Related News

ట్రెండింగ్ వార్తలు