ఫ్యాన్స్ కి విందు ఏర్పాటుచేసిన నటుడు సూర్య.. కారణం తెలిస్తే హాట్సాఫ్ అనాల్సిందే!

March 5, 2024

ఫ్యాన్స్ కి విందు ఏర్పాటుచేసిన నటుడు సూర్య.. కారణం తెలిస్తే హాట్సాఫ్ అనాల్సిందే!

తండ్రి ప్రముఖ నటుడు అయినా సినిమాల వైపు రావాలని అనుకోలేదు ఈ నటుడు. పరిస్థితులు సినిమాల వైపు తీసుకువచ్చినా నటుడు రఘువరన్ “జీవితంలో ఏం సాధించావని అలా నిద్రపోతున్నావు” అనే మాటల వలన నటనపై ఇన్స్పిరేషన్ తో నటనలో ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఇప్పుడు తమిళంలోనే టాప్ మోస్ట్ హీరోగా ఎదిగిన నటుడు సూర్య. సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి 26 సంవత్సరాలు అయింది. ఈ ప్రయాణంలో ఆయన ఎన్నో జాతీయ అవార్డులు అందుకున్నారు. బెస్ట్ యాక్టర్, బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్, బెస్ట్ క్రిటిక్స్ ఛాయిస్ అనే మూడు విభాగాల్లోని పురస్కారం అందుకున్న ఏకైక నటుడు సూర్య.

సమాజ సేవలో కూడా ముందుండే సూర్య అగరం ఫౌండేషన్ స్థాపించి పేద పిల్లలకి ఉచితంగా ఉన్నత విద్య అందిస్తూ వారి జీవితాలలో వెలుగుని నింపుతున్నాడు. అలాంటి సూర్య ఇప్పుడు తన అభిమానులని విందుకు ఆహ్వానించి వారికి స్వయంగా వడ్డన చేసి అందరి ప్రశంసలు పొందుతున్నాడు. అసలు ఎందుకు సూర్య ఫ్యాన్స్ కి విందు ఏర్పాటు చేశాడో తెలుసుకుందాం. గత ఏడాది డిసెంబర్ నెలలో తమిళనాడును మిచాంగ్ తుఫాను ముంచెత్తింది .

ఆ సమయంలో సూర్య సోదరులు 10 లక్షల విరాళం అందించడంతోపాటు సూర్య పిలుపుమేరకు నష్టపోయిన వారికి అండగా నిలిచి తుఫాను తగ్గేవరకు బాధితులకు సేవలు చేశారు ఆయన అభిమానులు. అభిమానులు చేసిన సేవను గుర్తించిన సూర్య వారందరినీ ఒకసారి కలుసుకోవాలని ఆహ్వానించి ఒక పార్టీని ఏర్పాటు చేశారు. చెన్నైలోని త్యాగరాయర్ నగరంలోని ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో చెన్నై, తిరువల్లూరు, కాంచీపురం, చెంగల్పట్టు జిల్లాలలో తుఫాను కారణంగా నష్టపోయిన ప్రజల కోసం పనిచేసిన సూర్య అభిమానుల సంఘంలోని సభ్యులందరినీ స్వయంగా కాల్ చేసి పిలిచారు.

వారందరికీ శాఖాహారం విందు ఏర్పాటు చేశారు. స్వయంగా తానే వడ్డించారు, అందరితోని కలిసి ఫోటోలు దిగుతూ ఆనందాన్ని వ్యక్తం చేశారు. అందుకు సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం సూర్య కంగువా సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా లో సూర్య ఆరు భిన్నమైన అవతారాల్లో కనిపించబోతున్నట్లు సమాచారం.

Read More: సినిమాలకు జీవిత దూరం అవ్వటానికి రాజశేఖర్ కారణమా?

Related News

ట్రెండింగ్ వార్తలు