ఈ పద్దతి సరైంది కాదు..ఆలోచించండి..యాంకర్ రష్మీ ఆగ్రహం

December 28, 2023

ఈ పద్దతి సరైంది కాదు..ఆలోచించండి..యాంకర్ రష్మీ ఆగ్రహం

బుల్లితెర యాంకర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి నటి రష్మి గౌతమ్(Anchor Rashmi Gautham) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. యాంకర్ గా బుల్లితెరపై ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ఈమె జంతు ప్రేమికురాలు అనే విషయం మనకు తెలిసిందే. తరచూ మూగ జంతువులను సంరక్షించాలి అంటూ అందరిలోనూ స్ఫూర్తిని నింపడమే కాకుండా ఎవరైనా జంతువులకు ఆపద కలిగిస్తే మాత్రం వారిని శిక్షించాలి అంటూ కూడా డిమాండ్ చేస్తూ ఉంటారు.

ఇలా తరచూ జంతువులకు సంబంధించినటువంటి పోస్టులను కూడా ఈమె చేస్తూ ఉంటారు. ఇటీవల కొందరు సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తున్నటువంటి ఒక పోస్టును ఈమె తన ఇంస్టాగ్రామ్ ద్వారా రీ పోస్ట్ చేస్తూ ఆ పోస్ట్ పై రష్మి(Anchor Rashmi) చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇందులో భాగంగా ఒక పులికి ప్రతిరోజు మత్తు ఇస్తూ ఉంటారని తద్వారా తాము ఫోటోలు తీసుకోవడానికి ఎంతో అనువుగా ఉందని డ్రగ్ ఇవ్వటం వల్ల అది మాపై అటాక్ చేయలేదు అంటూ కొందరు పోస్ట్ చేశారు ఈ పోస్ట్ పై రష్మి స్పందిస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు..

ఈ సందర్భంగా రష్మీ ఈ విషయం గురించి మాట్లాడుతూ.. ఇలా పులికి మత్తు ఇచ్చి ఫోటోలు దిగడం అనేది ఒక దుర్వినియోగమైనటువంటి చర్యగా భావించారు. ఇలా పులులతో ఈ విధంగా ప్రవర్తించడం సరైంది కాదని, ఈ విషయం గురించి మరోసారి ఆలోచించండి అంటూ ఈ సందర్భంగా రష్మీ చేసినటువంటి ఈ పోస్ట్ వైరల్ గా మారింది. మీకు నిజంగానే జ్ఞానోదయం కలిగితే వాటితో ఇలా ప్రవర్తించారనే ఉద్దేశంతోనే ఈమె ఈ పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతుంది.

Read MoreGlam Pix: Anasuya Bharadwaj

Related News

ట్రెండింగ్ వార్తలు