January 18, 2024
దేవదాసు సినిమాతో హీరోయిన్గా పరిచయమై ఫస్ట్ సినిమాతోనే తన అందం, అభినయంతో కుర్రకారులో మాంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది గోవా బ్యూటీ ఇలియాన. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో నటించినప్పటికీ పోకిరి సినిమాతో స్టార్ హీరోయిన్ స్టేటస్ తెచ్చుకుంది. తెలుగులో ఫుల్ ఫామ్లో ఉన్న సమయంలో బాలీవుడ్ వైపు వెళ్లి తన కెరీర్ను ఇరకాటంలో పెట్టుకుంది. దాంతో వివాహం చేసుకుని సినిమాలకు దూరమైంది.
రెండేళ్లుగా సినిమాలకు దూరంగా ఉన్న ఇలియానా.. సీనియర్ నటి విద్యా బాలన్తో కలిసి సందడి చేసేందుకు సిద్ధమైంది. వారిద్దరూ ప్రధాన పాత్రల్లో.. ప్రతీక్ గాంధీ, సెంథిల్ రామమూర్తిలకు జోడీలుగా నటిస్తున్న రొమాంటిక్ ప్రేమకథా చిత్రం ‘దో ఔర్ దో ప్యార్’.
ఈ సినిమాతో శిరీష గుహా ఠాకుర్తా దర్శకురాలిగా పరిచయం అవుతోంది. తాజాగా ఈ సినిమా ఫస్ట్లుక్ పోస్టర్ని సోషల్ మీడియాలో విడుదల చేశారు. దీనితో రిలీజ్ డేట్ సైతం ప్రకటించారు. ‘ఈ సినిమా తప్పకుండా మిమ్మల్ని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. కథలో మునిగి పోయేలా చేస్తుంది. ‘దో ఔర్ దో ప్యార్’ మార్చి 29న విడుదల కానుంది’ అంటూ సమాచారం అందించారు. సరికొత్త ప్రేమ కథాంశంతో అలరించనున్న ఈ చిత్రాన్ని అప్లాజ్ ఎంటర్టైన్మెంట్, ఎలిప్సిస్ ఎంటర్టైన్మెంట్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
సైకలాజికల్ హారర్ కామెడీతో భారీ విజయం అందుకున్న సినిమా ‘భూల్ భూలయ్యా’. ఇందులో మంజులికగా ఆకట్టుకునే నటన ప్రదర్శించారు విద్యాబాలన్. ప్రస్తుతం ఈ ఫ్రాంచైజీలలో వస్తున్న మూడో భాగంలోనూ విద్య కీలక పాత్ర పోషించనున్నట్లు సమాచారం. కార్తీక్ఆర్యన్ కథానాయకుడిగా తెరకెక్కనున్న ఈ వినోదాత్మక చిత్రంలో మంజులికగా విద్య మళ్లీ సందడి చేయనున్నట్లు తెలుస్తోంది. అనీస్ బజ్మీ దర్శకుడు. దీపావళికి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తున్నట్లు సన్నిహిత వర్గాలు తెలిపాయి.
Read More: Pushpa-2 Special Song: బన్నీతో డ్యాన్స్ చేయనున్న యంగ్ హీరోయిన్..ఇక ఫ్యాన్స్కి పండగే