July 2, 2022
గోపీచంద్ హీరోగా, రాశీఖన్నా హీరోయిన్గా మారుతి దర్శకత్వంలో రూపొందిన ‘పక్కా కమర్షియల్’ సినిమా ప్రస్తుతం థియేటర్స్లో ప్రదర్శితం అవుతోంది. అయితే ఈ సినిమాకు మేకర్స్ ఆశించినంత ఫలితం అయితే రాలేదు. గోపీచంద్ స్టైలిష్ యాక్షన్, రాశీఖన్నా గ్లామర్, సత్యరాజ్ ఎమోషన్ ఉన్న కథలో బలం లేకపోవడంతో పక్కా కమర్షియల్ సినిమాకు ప్రేక్షకుల్లో ఆశించినంత క్రేజ్ రాలేదు. పైగా ఇప్పుడొక ప్రచారం ఇండస్ట్రీలో తెరపైకి వచ్చింది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ‘పటాస్’ సినిమా గుర్తుండే ఉంటుంది. ఈ సినిమాలో తండ్రిపై కోపంతో కొడుకు పోలీసాఫీసర్గా మారతాడు. తన తండ్రీ పోలీస్గా ఉద్యోగం చేస్తున్న ప్లేస్లోకే వచ్చి అవినీతి పోలీసాఫీసర్గా పేరు తెచ్చుకుంటాడు. అయితే ఒక అమ్మాయి చనిపోవడంతో అవినీతి పోలీసాఫీసర్ అయిన కొడుకు నిజాయితీగా మారతాడు. అప్పటివరకు విలన్కు హెల్ప్ చేసిన వ్యక్తి తండ్రికి తోడై విలన్ పని పడతాడు. ఈ సినిమాలో తండ్రిగా సాయికుమార్, కొడుకుగా కళ్యాణ్రామ్ చేశారు.
సేమ్ స్టోరీ లైన్ ‘పక్కా కమర్షియల్’ సినిమాలో కనిపిస్తోంది. అయితే ‘పటాస్’ పోలీస్బ్యాక్డ్రాప్ ఫిల్మ్. పక్కా కమర్షియల్ లాయర్ల బ్యాక్డ్రాప్ ఫిల్మ్. అంతే తేడా..మిగతాదంతా సేమ్ టు సేమ్. ముందు కొడుకు అవినీతి లాయర్గా కనిపించడం, ఆ తర్వాత తండ్రి కోసం నిజాయితీ గల లాయర్గా మారిపోవడం. ఓ అమ్మాయి చావు వల్ల మనోవేదనకు గురై తండ్రి జడ్జి పదవికి రాజీనామా చేయడం, అవినీతి కొడుకుకి కోర్టులో వ్యతిరేకంగా పోరాడటం. ఫైనల్గా తండ్రి, కొడుకులు కలిసి విలన్ల పని పట్టడం. చిన్న చిన్న మార్పులే కానీ మిగతాదంగా సేమ్ టు సేమ్ అంటున్నారు చూసిన ఆడియన్స్