శ్రీవిష్ణుకు సందీప్‌కిషన్‌ ఇచ్చిన గిఫ్ట్‌ ‘సామజవరగమన’

July 23, 2023

శ్రీవిష్ణుకు సందీప్‌కిషన్‌ ఇచ్చిన గిఫ్ట్‌ ‘సామజవరగమన’

ప్రజెంట్ `సామజవరగమన` సినిమా టాలీవుడ్‌లో ట్రెండీ టాపిక్‌. ఏడుకోట్ల రూపాయాల బడ్జెట్‌తోనే రూపొందిన ఈ సినిమా ఇప్పటికే 50కోట్లకు పైగా గ్రాస్‌ కలెక్షన్స్‌ను సాధించింది. శ్రీవిష్ణు హీరోగా నటించిన ఈ సినిమాకు `వివాహభోజనంబు` ఫేమ్‌ రామ్‌ అబ్బరాజు దర్శకత్వం వహించారు. రెబ్బా మౌనికా జాన్‌ హీరోయిన్‌గా నటించగా, వీకే నరేశ్‌, వెన్నెల కిశోర్‌లు కీలక పాత్రల్లో నటించారు. జూన్‌ చివర్లో విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను బాగా నచ్చింది. ఓవర్‌సీస్‌లోకూడా వన్‌ మిలియన్‌ మార్క్‌ను దాటేసింది. అనిల్‌ సుంకర సమర్పణలో రాజేష్‌ దండా ఈ సినిమాను నిర్మించారు.

సందీప్‌కిషన్‌ నిర్మాతగా, హాస్య నటుడు సత్య మెయిన్‌ రోల్‌లో వచ్చిన చిత్రం ‘వివాహభోజనంబు’. ఓటీటీలో విడుదలైన ఈ సినిమాకు వీక్షకుల నుంచి మంచి మార్కులే పడ్డాయి. ఆ సినిమా తర్వాత రామ్‌ అబ్బరాజు సందీప్‌కిషన్‌తోనే ‘సామజ వరగమన’ సినిమాను తీయాలనుకున్నారు. అయితే ఆ సమయంలో సందీప్‌కిషన్‌ తన కెరీర్‌లోని తొలి పాన్‌ ఇండియన్‌ ఫిల్మ్‌ ‘మైఖేల్‌’ చేస్తున్నాడు. దీంతో ‘సామజవరగమన’కు నో చెప్పాడు సందీప్‌. అయితే నిర్మాత రాజేష్‌ దండా వద్దకు రామ్‌ అబ్బా రాజు ను పంపాడు సందీప్‌కిషన్‌. అలా శ్రీ విష్ణు ‘సామజవరగమనతో మరో సూపర్‌హిట్‌ను త‌న‌ ఖాతాలో వేసుకున్నాడు. ఇటు సందీప్‌కిషన్‌ ‘మైఖేల్‌’ మాత్రం డిజాస్టర్‌గా నిలిచింది.

‘సామజవరగమన’ సినిమాను తమిళం, హిందీలో రీమేక్‌ చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు నిర్మాత రాజేష్‌దండా చెప్పారు. సో..తమిళ రీమేక్‌లోకానీ, హిందీ రీమేక్‌లో కానీ సందీప్‌కిషన్‌ నటిస్తారెమో చూడాలి.

ఇక ప్రజెంట్‌ రాజేష్‌ దండా నిర్మిస్తున్న ‘ఊరిపేరు భైరవకోన’ సినిమాలో సందీప్‌కిషన్‌ హీరోగా నటిస్తున్నాడు. ‘టైగర్‌’ తర్వాత సందీప్‌కిషన్‌, దర్శకుడు వీఐ ఆనంద్‌ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా ఇది. యాభై నిమిషాలకు పైగా సీజీ వర్క్‌ ఉండటం వల్ల పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్స్‌ ఆలస్యం అవుతున్నాయి. ఇలా ఈ సినిమా విడుదల ఆలస్యం అవుతోంది. ‘ఊరిపేరు భైవరకోన’ తర్వాత సందీప్‌కిషన్‌తోనే మరో మూవీ చేయనున్నట్లు, ఈ సినిమా షూటింగ్‌ నవంబరులో ప్రారంభం కానున్నట్లుగా రాజేష్‌ దండా వెల్లడించారు.

Read Moreదర్శకులకు షాక్‌ ఇస్తున్న రానా

ట్రెండింగ్ వార్తలు