నేను బ్రతుకొద్దా… రెమ్యూనరేషన్ పెంపు పై ఘాటుగా స్పందించిన సుహాస్?

March 8, 2024

నేను బ్రతుకొద్దా… రెమ్యూనరేషన్ పెంపు పై ఘాటుగా స్పందించిన సుహాస్?

ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి వారిలో సుహాస్ ఒకరు. ఈయన నటనపై ఆసక్తితో కెరీర్ మొదట్లో షార్ట్ ఫిలిమ్స్ చేశారు. అనంతరం సినిమా అవకాశాలను అందుకుని చిన్న చిన్న పాత్రలలో నటిస్తూ ప్రేక్షకులను మెప్పించారు. ఇలా పలు సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ గా నటిస్తూ ప్రేక్షకులను మెప్పించినటువంటి సుహాస్ ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. ఇటీవల అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమా ద్వారా ఈయన ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

ఇక ఈ సినిమా కూడా ఎంతో అద్భుతమైనటువంటి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమా తర్వాత త్వరలోనే సుహాస్ ప్రసన్న వదనం అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నటువంటి నేపథ్యంలో ఇటీవల టీజర్ విడుదల చేశారు. ఈ టీజర్ లాంచ్ కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం అనంతరం చిత్ర బృందం మీడియా సమావేశంలో పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో భాగంగా ఈయనకు రెమ్యూనరేషన్ గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి. ఇటీవల వరుస సినిమాలలో నటిస్తూ ఉన్నటువంటి సుహాస్ భారీగా రెమ్యూనరేషన్ పెంచారు అంటూ వార్తలు వస్తున్నాయి. అయితే ఈ వార్తలపై ఈయనకు ప్రశ్నలు ఎదురయ్యాయి. ఇటీవల వరుస హిట్ సినిమాలో రావడంతో రెమ్యూనరేషన్ బాగా పెంచారని వార్తలు వస్తున్నాయి నిజం ఎంత అని ప్రశ్నించారు.

ఈ ప్రశ్నకు సుహాస్ సమాధానం చెబుతూ తాను బ్రతకొద్దా అందుకే రెమ్యూనరేషన్ పెంచాను అంటూ మొహమాటం లేకుండా తెలిపారు. నేను రోజుకు వంద రూపాయలు తీసుకుని పనిచేశానని తెలిపారు. ఇలా వందరూపాయలతో మొదలైనటువంటి తన ప్రయాణం ఇప్పటివరకు వచ్చింది అంటే నేను ఎంతో కష్టపడ్డానని ఇది నా కష్టానికి తగ్గ ఫలితం అని తెలిపారు. అందుకే రెమ్యూనరేషన్ పెంచానని తెలిపారు. అయితే ఈయన ఒక్కో సినిమాకు కోటి రూపాయలకు పైగా రెమ్యూనరేషన్ అందుకుంటున్నారని తెలుస్తుంది.

Read More: Nayanthara: నేను ఓడిపోయాను.. ఆందోళనలో ఫాన్స్?

Related News

ట్రెండింగ్ వార్తలు