సూపర్ హిట్ సినిమాకు నో చెప్పిన సూర్య చెల్లెలు.. మంచి ఛాన్స్ మిస్సయిందిగా?

March 25, 2024

సూపర్ హిట్ సినిమాకు నో చెప్పిన సూర్య చెల్లెలు.. మంచి ఛాన్స్ మిస్సయిందిగా?

కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా కొనసాగుతున్నటువంటి వారిలో నటుడు సూర్య, కార్తీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు వీరిద్దరూ కూడా ప్రముఖ డైరెక్టర్ శివకుమార్ వారసులుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి స్టార్ హీరోలుగా సక్సెస్ అయ్యారు. అయితే వీరికి కోలీవుడ్ ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా తెలుగులో కూడా భారీ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇక వీరికి ఒక చెల్లెలు కూడా ఉంది బృందా శివకుమార్ ఈమె కోలీవుడ్ ఇండస్ట్రీలో గాయనిగా డబ్బింగ్ ఆర్టిస్ట్ గా స్థిరపడ్డారు.

ఇలా కోలీవుడ్ ఇండస్ట్రీలో సింగర్ గా డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కొనసాగుతున్నటువంటి బృందా గురించి చాలామందికి తెలియదు అయితే ఈమె కోలీవుడ్ చిత్రపరిశ్రమలో మంచి సక్సెస్ అందుకున్నారు. ఇదిలా ఉండగా తాజాగా ఈమెకు ఒక అద్భుతమైన సినిమాలు హీరోయిన్గా నటించే అవకాశం వచ్చినప్పటికీ బృందా మాత్రం ఆ సినిమాని రిజెక్ట్ చేశారు. మణిరత్నం దర్శకత్వంలో మాధవన్ సిమ్రాన్ హీరో హీరోయిన్లుగా నటించినటువంటి చిత్రం కన్నతిల్ ముత్త మిదల్ అనే సినిమాలో ఈవెను హీరోయిన్గా భావించారట.

ఈ సినిమా తెలుగులో అమృత అనే పేరిట ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైనటువంటి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాకు ఏకంగా ఆరు జాతీయ చలనచిత్ర అవార్డులు, మూడు ఫిలింఫేర్ అవార్డులు, 7 తమిళనాడు స్టేట్ ఫిలిం అవార్డ్స్, ఆరు అంతర్జాతీయ చలనచిత్ర ఉత్సవాలలో అవార్డులను కూడా అందుకుంది అంటే ఈ సినిమా ఏ స్థాయిలో సక్సెస్ అయిందో అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి ఒక అద్భుతమైనటువంటి సినిమాకు నో చెప్పి సూర్య చెల్లెలు బృంద మంచి ఛాన్స్ మిస్ చేసుకున్నారని చెప్పాలి.

Read More: ఇప్పటికీ ఆయన సలహా పాటిస్తూనే ఉన్నాను.. శ్రియ కామెంట్స్ వైరల్!

Related News

ట్రెండింగ్ వార్తలు