కోట్లలో డబ్బులు ఇచ్చి పెళ్లిళ్లకు పిలుస్తున్నారు.. తీవ్ర దుమారం రేపుతున్న నాగార్జున కామెంట్స్?

March 6, 2024

కోట్లలో డబ్బులు ఇచ్చి పెళ్లిళ్లకు పిలుస్తున్నారు.. తీవ్ర దుమారం రేపుతున్న నాగార్జున కామెంట్స్?

సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో నటుడు నాగార్జున ఒకరు. అక్కినేని హీరోగా ఇండస్ట్రీలో కొనసాగుతూ ఉన్నటువంటి నాగార్జున ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించారు. ఇప్పటికీ ఈయన యువ హీరోలకు పోటీ ఇస్తూ వరుస సినిమాలలో నటిస్తూ ఉన్నారు. ఇలా హీరోగా మాత్రమే కాకుండా యాంకర్ గాను అదే విధంగా ఎన్నో కమర్షియల్ యాడ్స్ చేస్తూ నాగార్జున బిజీగా ఉన్నారు.

ఇదిలా ఉండగా తాజాగా నాగార్జునకు సంబంధించినటువంటి ఒక ఓల్డ్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇందులో భాగంగా నాగార్జున మాట్లాడుతూ కొంతమంది ప్రముఖ వ్యాపారవేత్తలు తమ ఇంటిలో కనుక పెళ్లిళ్లు జరిగితే సెలెబ్రెటీలను డబ్బులు ఇచ్చి మరి ఆహ్వానిస్తారని తెలిపారు. కేవలం వారి పెళ్లి వేడుకలలో ఒక 20 నిమిషాలు కనిపించి ఒక చిన్న పర్ఫామెన్స్ చేస్తే చాలు కోట్ల రూపాయలు అందుకోవచ్చు.

ఇలా నాకు కూడా ఎన్నో ఆహ్వానాలు వచ్చాయి కానీ నేను వాటిని రిజెక్ట్ చేశానని నాగార్జున తెలియజేశారు. ఇలా డబ్బులు తీసుకుని సెలబ్రిటీలు పెళ్లిళ్లకు వెళ్తారు అంటూ నాగార్జున చేసినటువంటి ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఇక ఈయన ఈ కామెంట్స్ గతంలో చేసినప్పటికీ ప్రస్తుతం ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ పెళ్లి వేడుకలలో భాగంగా బాలీవుడ్ సెలబ్రిటీలు డబ్బు తీసుకునే పెళ్లిళ్లకు వచ్చారు అన్న వార్త వైరల్ అవుతున్నటువంటి తరుణంలో నాగార్జునకు సంబంధించిన ఈ వీడియోని కూడా వైరల్ చేస్తున్నారు.

ఇలా అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ పెళ్లి వేడుకలు మూడు రోజులపాటు ఎంతో ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఈ పెళ్లి వేడుకలలో భాగంగా బాలీవుడ్ తారలందరూ కూడా తమ ఫ్యామిలీతో తరలివచ్చి సందడి చేశారు. ఇక వీరందరూ డబ్బు తీసుకొని ఇక్కడ పాల్గొన్నారనే విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Read More: ఆస్తులను అమ్మకానికి పెట్టిన పవన్.. కన్నేసిన టాలీవుడ్ హీరో?

ట్రెండింగ్ వార్తలు