పొలిమేరని మించేలా భయపడుతున్న తంత్ర.. ట్రైలర్ అదిరిపోయింది గా!

March 1, 2024

పొలిమేరని మించేలా భయపడుతున్న తంత్ర.. ట్రైలర్ అదిరిపోయింది గా!

అనన్య నాగళ్ళ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. మల్లేశం, వకీల్ సాబ్ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి. ఈమెని లీడ్ రోల్ లో పెట్టి శ్రీనివాస్ గోపిశెట్టి దర్శకత్వం వహిస్తున్న చిత్రం తంత్ర. శ్రీహరి తమ్ముడి కొడుకు ధనుష్ రఘుముద్రి హీరో పాత్ర పోషిస్తున్నాడు. హీరోయిన్ సలోని ఈ సినిమా ద్వారా రీ ఎంట్రీ ఇస్తోంది. ఈ సినిమాని నరేష్ బాబు, రవి చైతన్య నిర్మిస్తున్నారు. లేటెస్ట్ గా ఈ మూవీ ట్రైలర్ ని రిలీజ్ చేశారు మూవీ మేకర్స్.

మూవీ ట్రైలర్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు థ్రిల్ కలిగించింది. అసలు తాంత్రిక పూజలు ఉండటం నిజమేనా అని ప్రశ్నించగా రామ రావణ యుద్ధంలో రావణుడి కొడుకు ఇంద్రజిత్తు నికుంబలాదేవికి పూజ చేస్తున్నప్పుడు లక్ష్మణుడు ఆ పూజనీ పూర్తి చేయనివ్వకుండా వానరసైన్యంతో దాడి చేస్తాడు. అయితే చాలామందికి తెలియని విషయం ఏమిటంటే ఇంద్రజిత్తు తలపెట్టింది క్షుద్ర పూజ, నీకుంబళాదేవి క్షుద్ర దేవత అంటూ లక్ష్మణ్ తాంత్రిక పూజలు గురించి చెప్పే మాటల ట్రైలర్ ఆసక్తిగా ఉంది.

ఇక కథ విషయానికి వస్తే తాంత్రిక శాస్త్రంలో ఊహకు ఉందని ఎన్నో రహస్యాలు ఉన్నాయని పాయింట్ తో డైరెక్టర్ శ్రీనివాస్ గోపిశెట్టి తంత్ర సినిమాను తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. పల్లెటూర్లలో క్షుద్ర పూజలు, చేతబడులు ఎలా ఉంటాయనేది ఈ సినిమాలో ఆసక్తిగా చూపించబోతున్నారు. ఈ సినిమా మార్చి 15న రిలీజ్ కాబోతుంది. అయితే ఈ సినిమా కు సెన్సార్ ఏ సర్టిఫికెట్ జారీ చేసింది.

ఎందుకంటే ఈ సినిమాలో ఎక్కువ హింసాత్రమాక దృశ్యాలు, పూర్తి నగ్నత్వం, దూషించే భాష ఉంటాయి. చాలా కాలం తర్వాత వెండి తెరపై రీఎంట్రీ ఇస్తున్న సలోని ఈ సినిమాలో ఒక తాంత్రికురాలి పాత్ర పోషించినట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. ఇక చేతబడి చేసే తాంత్రికుడు పాత్రలో టెంపర్ వంశీ నటించాడు. ఈ సినిమా అనన్య నాగళ్ళతోపాటు సలోనీకి కూడా మంచి కం బ్యాక్ మూవీ అవుతుందేమో వేచి చూడాల్సిందే.

Read More: వెంకీ, అనిల్ రావిపూడి కాంబినేషన్లో కొత్త సినిమా టైటిల్.. సంక్రాంతికి వస్తున్నాం!

ట్రెండింగ్ వార్తలు