సక్సెస్ కోసం వేణు స్వామిని కలిసిన హీరోయిన్

March 12, 2024

సక్సెస్ కోసం వేణు స్వామిని కలిసిన హీరోయిన్

సినీ ఇండస్ట్రీలో వేణు స్వామి ఎంతో పేరు ప్రఖ్యాతలను పొందారు. అయితే ఈయన సెలబ్రిటీల గురించి చేసేటటువంటి వ్యాఖ్యలు కొన్నిసార్లు వివాదాలకు కారణం అవుతూ ఉంటాయి. ఇలా వివాదాస్పద జ్యోతిషుడిగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి వేణు స్వామి గురించి తరచు ఏదో ఒక వార్త వైరల్ అవుతూనే ఉంది అయితే తాజాగా పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ సినిమాలోని నటి అనన్య నాగళ్ళ నటించిన తంత్రం సినిమా విడుదలకు సిద్ధమవుతోంది.

ఈ క్రమంలోనే ఈ సినిమా విడుదలకు ముందు ఈమె వేణు స్వామిని కలవడంతో పెద్ద ఎత్తున ఇందుకు సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. మార్చి 15వ తేదీ ఈ సినిమా విడుదల కానున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేశారు. ఇప్పటికే చిత్ర బృందం ప్రమోషన్ కార్యక్రమాలలో ఎంతో బిజీగా ఉండగా తాజాగా నటి అనన్య వేణుస్వామిని కలవడంతో ఏమన్నా స్పెషల్ పూజలు చేయించారా? సినిమా సక్సెస్ కోసం వేణుస్వామిని కలిసిందా? లేదా సినిమాలో పూజలు లాంటివి వేణుస్వామి ఏమైనా డిజైన్ చేశాడా? అంటూ చర్చగా మారింది.

ఇలా ఈమె తన సినిమా విడుదలకు ముందు వేణు స్వామిని కలవడంతో ఈ విషయం గురించి పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి.మొత్తానికి వేణు స్వామిని కలిసినటువంటి హీరోయిన్ల జాబితాలో అనన్య పేరు కూడా చేరిపోయిందని చెప్పాలి. ఇక ఈమె మల్లేశం అనే సినిమా ద్వారా హీరోయిన్గా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. వకీల్ సాబ్ సినిమాతో ఎంతో మంచి పేరు సంపాదించుకున్నారు.

ప్రస్తుతం తంత్ర సినిమాతో పాటు పొట్టేలు వంటి సినిమాలలో నటిస్తూ ఎంత బిజీగా ఉన్నటువంటి ఈమె సరైన సక్సెస్ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే తంత్ర సినిమాపై భారీ స్థాయిలో అంచనాలను కూడా పెట్టుకున్నారు. మరి ఈమె నటించిన ఈ సినిమా ఎలాంటి సక్సెస్ అందిస్తుంది వేణు స్వామి పూజలు పలిస్తాయ అనేది తెలియాల్సి ఉంది.

Read More :  నయనతార విగ్నేష్ ఎప్పటికీ విడిపోరు

ట్రెండింగ్ వార్తలు