ఆ ఒక్కరు తప్ప అందరూ బలగం చూశారు.. వేణు ఎమోషనల్ కామెంట్స్!

February 9, 2024

ఆ ఒక్కరు తప్ప అందరూ బలగం చూశారు.. వేణు ఎమోషనల్ కామెంట్స్!

బలగం ఒక చిన్న సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో మంచి సక్సెస్ అందుకుంది. జబర్దస్త్ కార్యక్రమంలో కమెడియన్ గా కొనసాగుతూ ఉన్నటువంటి వేణు దర్శకుడుగా మారి బలగం సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. ప్రియదర్శి కావ్య కళ్యాణ్ రామ్ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను అనుగుణంగా తెరకేక్కించే ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు.

ఇక ఈ సినిమాకు ఎన్నో అంతర్జాతీయ స్థాయిలో అవార్డులు కూడా వచ్చిన సంగతి మనకు తెలిసిందే ఇలా ఈ సినిమా అన్ని విభాగాలలో అవార్డులను సొంతం చేసుకున్నారు. అంతేకాకుండా తెలంగాణలో ప్రతి ఒక్క మారుమూల గ్రామంలో కూడా ఈ సినిమాని తెరపై వేసుకొని మరి చూడడమే కాకుండా చిన్న చిన్న మనస్పర్ధల వల్ల విడిపోయిన అన్నదమ్ములు అక్క చెల్లెలు కూడా కలిశారు.

ఇలా ఈ సినిమా ఎన్నో కుటుంబాలను కూడా కలిపిందని చెప్పాలి ఈ సినిమా చూసిన వారందరూ కూడా సినిమా అద్భుతంగా ఉంది అంటూ ఎమోషనల్ అయ్యారు అయితే తాజాగా ఈ సినిమా గురించి డైరెక్టర్ వేణు మరోసారి ఎమోషనల్ అయ్యారు. తన దర్శకత్వంలో వచ్చినటువంటి మొట్టమొదటి బలగం సినిమా ఎంతో మంచి సక్సెస్ అందుకుంది ఈ సినిమాని ప్రతి ఒక్కరు కూడా చూసి ఆనందించారు.

ఇలా బలగం సినిమాని అందరూ చూశారని కానీ మీరు మాత్రం చూడలేకపోయారు అంటూ ఈయన ఎమోషనల్ అయ్యారు మరి బలగం సినిమాని ఎవరు చూడలేదు అనే విషయానికి వస్తే వేణు తండ్రి గత పాతిక సంవత్సరాల క్రితం మరణించారు. ఇలా తన తండ్రి మరణించడంతో తన తండ్రి ఈ సినిమా చూడలేకపోయారు అంటూ ఈయన తన తండ్రి వర్ధంతి పురస్కరించుకొని మిస్ యు నాన్న అంటూ సోషల్ మీడియా వేదికగా చేసినటువంటి పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది.ఇక వేణు బలగం సినిమా ద్వారా సక్సెస్ అందుకున్నారు ఈయన తదుపరి చిత్రం నానితో చేయబోతున్నారని తెలుస్తోంది. ఈ సినిమాకు ఎల్లమ్మ అనే టైటిల్ కూడా పెట్టాలని నిర్ణయించుకున్నట్లు వార్తలు వచ్చాయి కానీ ఇంకా ఈ సినిమా గురించి అధికారక ప్రకటన రాలేదు.

Read More: అయోధ్య రామ మందిరానికి కోట్లలో విరాళం.. ప్రకటించిన హనుమాన్ టీమ్!

ట్రెండింగ్ వార్తలు