ఇచ్చిన మాట నిలబెట్టుకున్న పల్లవి ప్రశాంత్?

March 15, 2024

ఇచ్చిన మాట నిలబెట్టుకున్న పల్లవి ప్రశాంత్?

ఒక రైతు బిడ్డగా ప్రశాంత్ పొలం పనులు చేసుకుంటూ వారు పడే కష్టాలను వీడియోల రూపంలో తెలియజేస్తూ వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఈయన సోషల్ మీడియా వేదికగా ఎంతో మంచి ఫాలోయింగ్ సొంతం చేసుకున్నారు. ఇలా కామన్ మ్యాన్ గా గుర్తింపు పొందినటువంటి పల్లవి ప్రశాంత్ ఏకంగా బిగ్ బాస్ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం అందుకున్నారు.

ఇలా బిగ్ బాస్ కార్యక్రమంలో కూడా ఈయన అందరి మన్ననలు పొంది ఏకంగా విజేతగా నిలిచిన సంగతి మనకు తెలిసిందే. ఈ కార్యక్రమం తర్వాత ప్రశాంత్ రైతుబిడ్డగా కాకుండా సెలబ్రిటీగా మారిపోయారు. ఈయన ఎక్కడికి వెళ్లినా అభిమానులు పెద్ద ఎత్తున చుట్టుముడుతూ తనతో సెల్ఫీల కోసం ఆరాటపడుతున్నారు. ఇలా సెలబ్రిటీ హోదా అనుభవిస్తూ ప్రశాంత్ ఎంతో బిజీగా గడుపుతున్నారు.

ఇకపోతే పల్లవి ప్రశాంత్ హౌస్ లో ఉన్నప్పుడే తాను కనుక విజేతగా నిలబడితే నాకు వచ్చే ప్రైజ్ మనీ మొత్తం పేద రైతు కుటుంబాలకు పంచుతానని ఈయన తెలిపారు. అయితే ఈయన విన్నర్ గా నిలవడం ప్రైజ్ మనీ గెల్చుకోవడం జరిగింది కానీ ఇప్పటివరకు ఆ డబ్బును మాత్రం రైతులకు పంచలేదు. అయితే ఈ విషయంపై సోషల్ మీడియా వేదికగా ఇచ్చిన మాట తప్పారని భారీ స్థాయిలో ఈయనపై ట్రోల్స్ జరిగాయి.

ఇలా తన గురించి వస్తున్నటువంటి ఈ ట్రోల్స్ ని కొట్టి పారేస్తూ పల్లవి ప్రశాంత్ రైతులకు సహాయం చేయడం మొదలుపెట్టారు. ఈయన మొట్టమొదటిగా గజ్వేల్ లోని కొవ్వూరు గ్రామానికి చెందినటువంటి ఒక పేద రైతు కుటుంబానికి సహాయం చేశారు. తల్లిదండ్రులు ఇద్దరు చనిపోగా అనాధలు అయినటువంటి ఆ చిన్నారులకు ఈయన లక్ష రూపాయల ఆర్థిక సహాయం అందించడమే కాకుండా ఏడాదికి సరిపడా బియ్యం బస్తాలను కూడా అందించి అండగా నిలబడ్డారు. ఇక ప్రశాంత్ సహాయంతో పాటు సందీప్ మాస్టర్ కూడా పాతికవేల రూపాయలను ఆ కుటుంబానికి అందించారు.

Read More: ఆరేళ్ల ప్రేమ ప్రయాణం పై ఎమోషనల్ పోస్ట్ చేసిన రహస్య!

ట్రెండింగ్ వార్తలు