మరోసారి తల్లిదండ్రులైన గీత మాధురి నందు?

February 13, 2024

మరోసారి తల్లిదండ్రులైన గీత మాధురి నందు?

టాలీవుడ్ ఇండస్ట్రీలో సింగర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో సింగర్ గీతామాధురి ఒకరు. ఈమె ఎన్నో అద్భుతమైన సినిమాలలో అద్భుతమైన పాటలను ఆలపించి ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు ఇక గీత మాధురి నటుడు నందుని ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి మనకు తెలిసిందే. వీరి వివాహం 2014వ సంవత్సరంలో పెద్దల సమక్షంలో ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది. ఇలా పెళ్లయిన తర్వాత ఈ దంపతులు ఎంతో అన్యోన్యంగా ఉన్నారు ఈ జంటకు 2019వ సంవత్సరంలో ఒక అమ్మాయి జన్మించారు.

ఇక తన కుమార్తెకు దాక్షాయిని ప్రకృతి అనే నామకరణం చేసినట్లు గీతామాధురి తెలిపారు. అంతేకాకుండా తన కూతురికి సంబంధించిన అన్ని విషయాలను ఈమె ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వచ్చారు. ఇకపోతే చాలా సంవత్సరాలు తర్వాత వీరిద్దరూ మరో బేబీని ప్లాన్ చేసుకున్నారు. ఈ క్రమంలోనే గీత మాధురి ఫిబ్రవరిలో తన కుమార్తె అక్క కాబోతుంది అంటూ ఈమె సోషల్ మీడియా వేదికగా తన ప్రేగ్నెన్సీ గురించి తెలియజేశారు.

ఇకపోతే ఇటీవల గీతా మాధురి సీమంతపు వేడుకలు కూడా ఎంతో ఘనంగా జరిగాయి. ఇలా తన సీమంతపు వేడుకలకు సంబంధించిన ఫోటోలను వీడియోలను ఈమె సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇలా ఇటీవల సీమంతపు జరుపుకున్నటువంటి గీత మాధురి తాజాగా బిడ్డకు జన్మనిచ్చారని తెలుస్తుంది ఈమె శనివారం పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చారట అయితే ఈ విషయాన్ని చాలా ఆలస్యంగా తెలియజేశారు. సోషల్ మీడియా వేదికగా గీత నందు ఇద్దరు కూడా తమ బిడ్డకు జన్మనిచ్చిన విషయాన్ని తెలియజేస్తూ పోస్ట్ చేశారు అయితే బేబీ ఫోటోని మాత్రం వీళ్ళు షేర్ చేయలేదు.

ఇలా తనకు కొడుకు పుట్టడంతో కుటుంబ సభ్యులందరూ చాలా సంతోషంగా ఉన్నారు అంటూ నందు తన ఆనందాన్ని వ్యక్తపరిచారు. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఎంతో మంది సెలబ్రిటీలు అదేవిధంగా అభిమానులు ఈ దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు మొదట అమ్మాయి ఇప్పుడు అబ్బాయి కావడంతో గీత మాధురి కుటుంబ సభ్యులకు కూడా సంతోషంగా ఉన్నారని తెలుస్తోంది. ఇక నందు కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు ఈయన వరుసగా వెబ్ సిరీస్ లలో నటించడమే కాకుండా పలు కార్యక్రమాలకు యాంకర్ గా కూడా వ్యవహరిస్తూ ఉన్నారు.

Read More: విజయ్ దేవరకొండ సినిమాలు నచ్చవు.. పీవీ సింధు షాకింగ్ కామెంట్స్!

ట్రెండింగ్ వార్తలు