యూపీఐ చేస్తే చాలు..మహేష్ వాయిస్ వినోచ్చు తెలుసా.. ఖుషి అవుతున్న ఫ్యాన్స్?

February 21, 2024

యూపీఐ చేస్తే చాలు..మహేష్ వాయిస్ వినోచ్చు తెలుసా.. ఖుషి అవుతున్న ఫ్యాన్స్?

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మహేష్ బాబు ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతూ ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ఇలా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్నటువంటి మహేష్ బాబు కేవలం హీరోగా మాత్రమే కాకుండా ఎన్నో సినిమాలకు తన వాయిస్ ఓవర్ ఇచ్చిన సంగతి మనకు తెలిసిందే. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ సినిమాలకు మహేష్ బాబు వాయిస్ ఓవర్ ఇస్తుంటారు.

ఇలా ఏదైనా సినిమాలకు మహేష్ బాబు వాయిస్ ఓవర్ ఇస్తేనే అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తారో అలాంటిది ఇకపై యూపీఐ పేమెంట్ చేస్తే చాలు మహేష్ బాబు వాయిస్ వినొచ్చనే విషయం తెలియడంతో అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం అంతా డిజిటల్ మయం అయిన సంగతి మనకు తెలిసిందే ఏదైనా షాపింగ్ చేస్తే వెంటనే డిజిటల్ పేమెంట్ చేస్తుంటాము.

ఈ క్రమంలోనే ఎంతోమంది ఫోన్ పే పేటీఎం ద్వారా పేమెంట్ చేస్తూ ఉంటారు. ఇలా పేమెంట్ చేసిన తర్వాత పేమెంట్ సెండ్ అయినట్లు మనం వింటూ ఉంటాము అయితే ఇకపై ఇలా యూపీఐ పేమెంట్ చేసినప్పుడల్లా మహేష్ బాబు వాయిస్ వింటారని తెలుస్తుంది. మహేష్ బాబు వాయిస్ తో టెక్నాలజీని యాడ్ చేసి తమ పేమెంట్స్ కోసం తీసుకొచ్చారు. దీనితో ఈ సరికొత్త స్పీకర్స్ లో పేమెంట్స్ చేస్తే మహేష్ వాయిస్ లో ఇక మీద నుంచి వినిపించనున్నాయని చెప్పాలి. ఇక ఈ విషయం వైరల్ గా మారడంతో మహేష్ బాబు ఫ్యాన్స్ ఈ వార్తను మరింత వైరల్ చేస్తున్నారు.

Read More: మగ బిడ్డకు జన్మనిచ్చిన విరుష్క.. కొడుకు పేరుకు అర్థం ఏంటో తెలుసా?

ట్రెండింగ్ వార్తలు