మా జీవితాల్లో ఏం జరుగుతుందో వాళ్లకే ముందు తెలుస్తుంది.. అసహనం వ్యక్తం చేసిన తమన్న?

March 2, 2024

మా జీవితాల్లో ఏం జరుగుతుందో వాళ్లకే ముందు తెలుస్తుంది.. అసహనం వ్యక్తం చేసిన తమన్న?

తమన్నా పరిచయం అవసరం లేని పేరు సౌత్ నార్త్ అనే తేడా లేకుండా వివిధ భాషలలో సినిమా అవకాశాలను అందుకుంటూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. ఈమె ఇండస్ట్రీలోకి వచ్చి దాదాపు రెండు దశాబ్దాలు అవుతున్న ఇప్పటికీ వరుస సినిమా అవకాశాలను అందుకుంటు దూసుకుపోతున్నారు. ఇక ఇటీవల కాలంలో ఈమె బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో ప్రేమలో పడిన సంగతి మనకు తెలిసిందే. ఇలా తన ప్రియుడితో కలిసి ప్రస్తుతం ఈమె వృత్తిపరమైన వ్యక్తిగత జీవితాన్ని కూడా ఎంతో ఎంజాయ్ చేస్తున్నారు.

ఇకపోతే తాజాగా తమన్నా సోషల్ మీడియాలో తమ పట్ల వస్తున్నటువంటి ట్రోల్స్ పై స్పందిస్తూ అసహనం వ్యక్తం చేశారు. ఇటీవల కాలంలో తమన్నా శరీర బరువు పెరిగారని కోవిడ్ తర్వాత ఈమె శరీర బరువు పెరిగారు అంటూ తన పట్ల బాడీ షేమింగ్ కామెంట్స్ చేసిన సంగతి మనకు తెలిసిందే. అయితే తాజాగా తమ పట్ల వస్తున్నటువంటి ఇలాంటి కామెంట్లపై తమన్న స్పందిస్తూ చేసిన ఈ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.

తమన్నా ఈ విధంగా స్పందిస్తూ సెలబ్రిటీల విషయాలలో సోషల్ మీడియా ఇన్వాల్వ్మెంట్ ఎక్కువగా ఉందని తెలిపారు. అసలు మా జీవితాలలో ఏం జరుగుతుందో మాకంటే ముందు వాళ్లకే బాగా తెలుసని ఈమె అసహనం వ్యక్తం చేశారు. అందుకే తాను సోషల్ మీడియాలో వచ్చే ట్రోల్స్ కామెంట్ల గురించి ఏమాత్రం పట్టించుకోనని ఈమె తెలియజేశారు.

ప్రస్తుతం తాను తన దృష్టి మొత్తం తన కెరియర్ పైనే పెట్టానని తెలియజేశారు. తనకు ఇండస్ట్రీలలో అవకాశాలు వస్తున్నాయని నాకు సౌత్ నార్త్ అనే బేధాలు ఏమాత్రం లేవని తెలిపారు. నా కేరియర్ ప్రారంభమైనది నార్త్ లోనేనని, నాకు సౌత్ నార్త్ రెండు కూడా సొంత ఇంటి లాంటివి అంటూ ఈ సందర్భంగా తమన్న చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

ఇక ఈమె తెలుగులో చివరిగా మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన భోళా శంకర్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు అయితే ఈ సినిమా పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ప్రస్తుతం మేము పలు బాలీవుడ్ సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా మారిపోయారు.

Read More: సౌందర్యతో జగపతిబాబుకు అఫైర్ ఉందా.. అసలు నిజాలు బయటపెట్టిన ఆమని?

ట్రెండింగ్ వార్తలు