February 10, 2024
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. కీర్తి సురేష్ ప్రస్తుతం అడపాదడపా సినిమాలలో నటిస్తూ బిజీ బిజీగా ఉన్న విషయం తెలిసిందే. మొదట నేను శైలజ సినిమాతో తెలుగు ఇండస్ట్రీ పరిచయమైన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత మహానటి సినిమాతో రెండు తెలుగు రాష్ట్రాలలో భారీగా పాపులారిటీని సంపాదించుకుంది. తెలుగు, తమిళం,మలయాళం భాషలలో అనేక సినిమాల్లో నటించింది. ఇది ఇలా ఉంటే తాజాగా కీర్తి సురేష్ చేసిన వాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. గతంలో కీర్తి సురేష్ కు ఎదురైన ఒక చేదు అనుభవం గురించి ఆమె చెప్పుకొచ్చింది.
ఈ సందర్భంగా కీర్తి సురేష్ మాట్లాడుతూ.. కీర్తి సురేష్ హీరోయిన్ గా సినిమా ఇండస్ట్రీకి రాకముందు ఒకరోజు అర్ధరాత్రి తాను తన స్నేహితులతో కలిసి వెళ్తుండగా, ఒక వ్యక్తి మద్యం తాగి కీర్తి సురేష్ ని వెనకాల వైపు టచ్ చేస్తూ రాసుకుంటూ వెళ్ళాడట. అప్పుడు కీర్తి సురేష్ కి కోపం కట్టలు తెంచుకోవడంతో వెంటనే అతన్ని పట్టుకొని చెంపలు పగలగొట్టిందట. ఆ తరువాత ఆ మందుబాబు తనపై దాడి చేసి తలపై కొట్టాడని, దీంతో అతన్ని చితకబాది పోలీసులకు అప్పగించినట్లు కీర్తి సురేష్ గుర్తు చేసుకున్నారు. పోలీసులు అతన్ని ఆ రాత్రి అంతా జైలులోనే ఉంచి ఉదయం విడిచి పెట్టారని తెలిపింది.
అయితే ఇది నమ్మశక్యంగా లేదంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇకపోతే కీర్తి సురేష్ సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ సైరన్ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాతో పాటు మరికొన్ని సినిమాలలో నటిస్తూ బిజీ బిజీగా గడుపుతోంది. కాగా కీర్తి సురేష్ గత ఏడాది చిరంజీవి నటించిన బోళా శంకర్ సినిమాలో చిరంజీవికి చెల్లెలుగా నటించిన విషయం తెలిసిందే. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా ఊహించిన విధంగా డిజాస్టర్ గా నిలిచింది.
Read More: వేణు స్వామితో అషు రెడ్డి ప్రత్యేక పూజలు..అందుకే చేయించిందా?