బాలీవుడ్ కొమ్ములు విరిసిన ఈ దర్శకుడు .. ఎవరో గుర్తుపట్టారా!

March 7, 2024

బాలీవుడ్ కొమ్ములు విరిసిన ఈ దర్శకుడు .. ఎవరో గుర్తుపట్టారా!

తీసిన ప్రతి సినిమా ఇండస్ట్రీ హిట్ అందుకుంటూ అందరి ప్రశంసలు పొందుతున్న ఒక స్టార్ డైరెక్టర్, మేమే తోపులం అంటూ విర్రవీగిన బాలీవుడ్ కొమ్ములు విరిచి ఇది మా సత్తా అంటూ చాటిన టాలీవుడ్ దర్శకులలో ఒకడు. ఇప్పుడు ఈ స్టార్ డైరెక్టర్ గుండుతో కనిపించి అందరికీ షాక్ ఇస్తున్నాడు. ఇతను ఎవరో తెలుసా అంటూ నేటిజన్స్ సరదాగా తమాషాలు చేస్తున్నారు.

ఇంతకీ గుండుతో ఉన్న ఈ వ్యక్తిని మీరైనా గుర్తుపట్టారా.. అతనే నండి స్టార్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా. సందీప్ రెడ్డి అనేసరికి అందరికీ పైజామా గడ్డం, జుట్టు, పైజామా గుర్తుకు వస్తాయి. ఇతర ఔట్ఫిట్స్ లో గాని, క్లీన్ షేవింగ్ లో గాని సందీప్ రెడ్డి వంగా ఎప్పుడూ బయట కనిపించలేదు. అలాంటి దర్శకుడు ఇప్పుడు గుండుతో దర్శనం ఇచ్చేసరికి చాలామంది అతని గుర్తుపట్టలేదు. ఇంతకీ ఏం జరిగిందంటే.. సందీప్ రెడ్డివంగా ప్రస్తుతం తిరుమల లో ఉన్నాడు.

వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నాడు అక్కడే తలనీలాలు కూడా సమర్పించుకోవడంతో రూపం గుర్తుపట్టలేనట్లుగా తయారైంది. నిజంగానే చాలామంది గుర్తుపట్టలేదు కూడా. సందీప్ రెడ్డివంగా అక్కడ మీడియాతో మాట్లాడాడు. ప్రతి సంవత్సరం తిరుమల కి వస్తుంటానని కానీ ఈ మధ్య చాలా గ్యాప్ వచ్చిందని చెప్పాడు. నెక్స్ట్ సినిమా స్పిరిట్ ప్రభాస్ తో చేస్తున్నాను అని చెప్పాడు అంతకుమించి ఎలాంటి అప్డేట్స్ ఇవ్వలేదు.ఇక సందీప్ రెడ్డి వంగా టాలెంట్ గురించి మాట్లాడుకోవాలంటే బాలీవుడ్ వాళ్లు భయపడేలా అక్కడి వాళ్లకి యానిమల్ సినిమాతో చెమటలు పట్టించేశాడు.

సాధారణంగా బాలీవుడ్ వాళ్ళు బయట వాళ్ళని బాలీవుడ్ లో ఎదగనివ్వరు. కానీ ఇప్పుడు బయట వాళ్ళు వస్తున్నారు అంటే బాలీవుడ్ వాళ్ళు ఒళ్ళు దగ్గర పెట్టుకొని పరిస్థితికి తీసుకువచ్చాడు. అక్కడ జరిగే ఆధిపత్యం, నెంబర్ గేమ్స్ కార్పొరేట్ బుకింగ్ మాఫియా గురించి బాహాటంగానే వ్యా ఖ్యలు చేశాడు. ఇది సందీప్ రెడ్డి వంగ విజయ మాత్రమే కాదు బాలీవుడ్ మీద టాలీవుడ్ సాధించిన విజయంగా గర్వంగా చెప్పుకుంటున్నారు టాలీవుడ్ వాళ్లు.

Read More: ఇటలీ బీచ్ లో షూట్ చేస్తున్న కల్కి టీం.. సోషల్ మీడియాలో ఫోటో షేర్ చేసిన మూవీ యూనిట్!

ట్రెండింగ్ వార్తలు