February 1, 2024
డైరెక్టర్ సందీప్ రెడ్డి దర్శకత్వంలో బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్, నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం యానిమల్
..ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఎంతో అద్భుతమైనటువంటి విజయాన్ని సొంతం చేసుకుంది.
బాక్సాఫీస్ వద్ద దాదాపు 900 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబడినటువంటి ఈ సినిమా ప్రస్తుతం ఓటీటీలో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తుంది. ఇకపోతే ఈ సినిమాలో హీరోయిన్గా రష్మిక మందన్న నటించినప్పటికీ కొన్ని బోల్డ్ సన్నివేశాలలో నటించి యూత్కి ఫేవరేట్ అయింది తృప్తి దిమ్రి. తృప్తి ఈ సినిమాలో కనిపించినది కొంతసేపే అయినప్పటికీ ఈమె పాత్రకు మాత్రం ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు వచ్చాయి. ఇక ఈ సినిమా ద్వారా సక్సెస్ అందుకున్నటువంటి ఈమెకు టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా అవకాశాలు వస్తున్నాయి.
ఇలా వరుస సినిమా అవకాశాలను అందుకుంటు కెరియర్ పరంగా బిజీగా ఉన్నటువంటి తృప్తి ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఈమెకు పెళ్లి గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి… పెళ్లి గురించి తృప్తి సమాధానం చెబుతూ నాకు ప్రస్తుతం పెళ్లి చేసుకోవాలని ఆలోచనలు ఏ మాత్రం లేదని తెలిపారు. తన దృష్టి మొత్తం తన కెరియర్ పైనే ఉందని ఈమె వెల్లడించారు.
ఇకపోతే తాను పెళ్లి చేసుకోబోయే అబ్బాయి ఎలా ఉండాలి.. తనలో ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి..అనే విషయం గురించి మాట్లాడారు. తాను పెళ్లి చేసుకోబోయే అబ్బాయి మంచి వ్యక్తి అయితే చాలు.. పేరు పలుకుబడి, డబ్బు వాటంతట అవే వస్తాయి అంటూ ఈమె చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇక ఈమె ఇదివరకు బాలీవుడ్ ఇండస్ట్రీలో పలు సినిమాలలో నటించినప్పటికీ రాని గుర్తింపు యానిమల్ సినిమా ద్వారా రావడంతో రాత్రికి రాత్రే స్టార్ హీరోయిన్గా మారింది. ప్రస్తుతం తెలుగులో కూడా సినిమా అవకాశాలు క్యూ కడుతున్నాయి.
Read More: రీ రిలీజ్ కి సిద్ధమైన ఆరుగురు పతివ్రతలు!