త్వరలోనే సుందరం మాస్టర్ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్.. ఒకేసారి రెండు ఓటీటీలలోకి!

March 7, 2024

త్వరలోనే సుందరం మాస్టర్ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్.. ఒకేసారి రెండు ఓటీటీలలోకి!

టాలీవుడ్ కమెడియన్ వైవా హర్ష హీరోగా ఎంట్రీ ఇచ్చిన చిత్రం సుందరం మాస్టర్. ఈ సినిమా ఫిబ్రవరి 23న థియేటర్లలో విడుదలై యావరేజ్ టాక్ ని సొంతం చేసుకుంది. అయితే తక్కువ బడ్జెట్ మూవీ కావటంతో నిర్మాతలకు బాగానే లాభాలు వచ్చినట్లు సమాచారం. ఈ సినిమాకి మాస్ మహారాజా రవితేజ నిర్మాతగా వ్యవహరించడం, మెగాస్టార్ చిరంజీవి, నాగచైతన్య వంటి స్టార్ హీరోలు ప్రమోషన్లలో పాల్గొనడంతో సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి.

థియేటర్లలో ఒక మోస్తరుగా ఆడిన ఈ సినిమా ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్ కి సిద్ధమవుతుంది. ఏకంగా రెండు ఓటీటీలో సుందరం మాస్టర్ సినిమా అందుబాటులోకి రాబోతుంది. ప్రముఖ తెలుగు ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్స్ ఆహా తో పాటు ఈటీవీ విన్ లో ఈ లేటెస్ట్ కామెడీ ఎంటర్టైనర్ స్ట్రీమింగ్ కాబోతుంది. మార్చి 21 లేదా 22 తేదీలలో ఈ మూవీ ఓటీ టీ లోకి స్ట్రీమింగ్ అవుతుందని సమాచారం. త్వరలోనే రిలీజ్ డేట్ పై అధికారిగా సమాచారం వెలువడుతుంది.

ఇక సినిమా కధ విషయానికి వస్తే అడవి మధ్యలో ఉన్న మిర్యాల మెట్ట అనే ఊరివాళ్లు తమకు ఇంగ్లీష్ టీచర్ కావాలని స్థానిక ఎమ్మెల్యేను అభ్యర్థిస్తారు. దీంతో ఆ ఊరికి సుందరం మాస్టర్ ని పంపిస్తాడు ఎమ్మెల్యే. అయితే ఊరిలో వారందరూ ఇంగ్లీష్ అనర్కళంగా మాట్లాడుతూ సుందరం మాస్టర్ కి ఎదురు పరీక్ష పెడతారు. ఇందులో ఫెయిల్ అయితే ఉరితీసి చంపేస్తామని సుందరం మాస్టర్ ని బెదిరిస్తారు.

మరి ఆ టెస్టులో సుందరం మాస్టర్ పాస్ అయ్యాడా? అసలు ఎమ్మెల్యే సుందరం మాస్టర్ ని ఆ పల్లెటూరికి ఎందుకు పంపించాడు? ఆ ఊరిలో ఉన్న ఒక విలువైన వస్తువు ఆచూకీ సుందరం మాస్టర్ కనిపెట్టాడా? తెలుసుకోవాలంటే సినిమా చూసి తీరాల్సిందే. ఈ సినిమాలో సుందరం మాస్టర్ గా వైవా హర్ష తన కామెడీ టైమింగ్ తో ఆకట్టుకున్నాడు. మిర్యాల మెట్ట ఊరి వాళ్ళతో ఇంగ్లీష్ మాట్లాడే సీన్స్ ప్రేక్షకులను అలరించాయి. ఈ సినిమాలో దివ్య శ్రీపాద కీలక పాత్రలో నటించగా శ్రీ చరణ్ పాకాల మ్యూజిక్ అందించాడు.

Read More: గామి చిత్ర యూనిట్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్న సినీ ప్రముఖులు.. ఇప్పుడు దర్శకధీరుడు రాజమౌళి కూడా!

ట్రెండింగ్ వార్తలు