February 8, 2024
వైసీపీ అధినేత దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర ఆధారంగా రూపొందిన చిత్రం యాత్ర. ఈ సినిమా గతంలో విడుదల అయ్యి మంచి విజయం సాధించిన విషయం తెలిసిందే.. ఈ సినిమాకు సిక్వెల్ గా తాజాగా తెరకెక్కిన మూవీ యాత్ర 2. రాజశేఖర్ రెడ్డి తనయుడు ప్రస్తుతం ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు మహి వి.రాఘవ్. ఇందులో వైఎస్ రాజశేఖరరెడ్డి పాత్రలో మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాత్రలో హీరో జీవా నటించారు. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ టీజర్, ట్రైలర్తో పాటు పాటలు సినిమాపై భారీ హైప్ని క్రియేట్ చేశాయి. ఈ సినిమా కోసం వైసీపీ అభిమానులు ప్రేక్షకులు కళ్ళు కాయలు కాచే విధంగా ఎదురుచూస్తున్నారు.
ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని వైఎస్సార్, వైఎస్ జగన్ అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులంతా ఆసక్తిగా ఎదురుచూశారు. ఎట్టకేలకు నేడు ఫిబ్రవరి 8 ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఓవర్సీస్తో పాటు పలు చోట్ల ఇప్పటికే ఫస్ట్డే ఫస్ట్ షో పడిపోయింది. దీంతో సినిమా చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. మరి ఈ సినిమా ట్విట్టర్ రివ్యూ ఎలా ఉందో, నెటిజెన్స్ నుంచి ఈ సినిమాకు ఎలాంటి స్పందన వస్తుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. యాత్ర 2 చిత్రానికి ఎక్స్లో పాజిటివ్ స్పందన వస్తోంది. సినిమా అద్భుతంగా ఉందని నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు.
ఇప్పటివరకు వచ్చిన బయోపిక్లో యాత్ర 2 బెస్ట్ బయోపిక్ అని కొంతమంది నెటిజన్స్ అభిప్రాయపడుతున్నారు. సినిమాలో చాలా ఎమోషనల్ సీన్స్ ఉన్నాయట. తెలియకుండా కన్నీళ్లు వచ్చేస్తాయంటూ పలువురు నెటిజన్స్ ఎక్స్లో కామెంట్ చేస్తున్నారు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్. సినిమా ఏముంది రా బాబు అంటూ కామెంట్ చేశాడు మరొక నెటిజన్. యాత్ర 2 బెస్ట్ బయోపిక్. స్టార్టింగ్ నుంచే గూస్ బంప్స్ వచ్చేలా చేశాడు మహి వి. రాఘవ్. ఇంతకు ముందు జగన్పై కొంచెం ద్వేషం ఉండే సినిమా చూశాక అది ప్రేమలా మారింది. వైఎస్ జగన్ని ద్వేషించేవారికి కూడా గూస్ బంప్స్ వచ్చే మూమెంట్స్ ఉన్నాయంటూ ఈ మూవీకి నెటిజన్ ఏకంగా 4/5 రేటింగ్ ఇచ్చాడు. మరొక నెటిజన్ స్పందిస్తూ.. నిజాయితీగా చెబుతున్నాను తెలుగులో ఇప్పటివరకు వచ్చిన బయోపిక్లో యాత్ర 2 బెస్ట్ బయోపిక్. బ్లాక్ బస్టర్ మూవీ. బొమ్మ అదిరింది అంటూ నెటిజన్ కామెంట్ చేశాడు.
యాత్ర-2 సినిమా చూస్తూ థియేటర్లో అందరూ భావోద్వేగానికి గురయ్యారు. మనం మర్చిపోయిన ఎన్నో జ్ఞాపకాలను ఈ మూవీ కచ్చితంగా గుర్తు చేస్తుందని వైఎస్సార్సీసీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. వైఎస్ఆర్ మరణం, తదనంతర పరిణామాలు,తన తండ్రి మరణంతో నష్టపోయిన వారిని ఓదార్చేందుకు జగన్ ఓదార్పు యాత్రను ఎలా ప్రారంభించాడో, ఆయన నిర్ణయం వల్ల ఎదుర్కొన్న పరిణామాలను ఈ చిత్రంలో చూపించారు. మొత్తానికి ట్విట్టర్లో ఈ సినిమాకు వస్తున్న స్పందనను బట్టి చూస్తే ఈ సినిమా బ్లాక్ బస్టర్ హీట్ అవ్వడం ఖాయం అనిపిస్తోంది.
Read More: చరణ్ కి జోడిగా దేవర బ్యూటీ?