కుమారి ఆంటీ బిజినెస్ పై దెబ్బ కొట్టిన బిగ్ బాస్ బ్యూటీ.. దారుణంగా ఉందంటూ?

February 19, 2024

కుమారి ఆంటీ బిజినెస్ పై దెబ్బ కొట్టిన బిగ్ బాస్ బ్యూటీ.. దారుణంగా ఉందంటూ?

కుమారి ఆంటీ పరిచయం అవసరం లేని పేరు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఎంతో పాపులర్ అయినటువంటి ఈమె ప్రస్తుతం సెలబ్రెటీగా మారిపోయారు. రోడ్డు పక్కన ఫుడ్ బిజినెస్ పెట్టుకుంటూ ఎంతోమంది ఆకలి తీర్చుతూ ఈమె బిజినెస్ చేసుకుంటూ ఉండేవాళ్ళు ఇలా రోజుకు వందలకు పైగా కస్టమర్స్ ఆమె స్టాల్ వద్దకు వచ్చి ఆమె చేతి వంట రుచి చూసేవారు. ఈ క్రమంలోనే కొంతమంది యూట్యూబ్ ఛానల్ వాళ్ళు వెళ్లి ఆమెను ఇంటర్వ్యూ చేయడంతో కుమారి ఆంటీ ఎంతో పాపులర్ అయ్యారు.

ఇలా ఈమెకు వచ్చిన పాపులారిటీతో ఇతర రాష్ట్రాల నుంచి కూడా కస్టమర్లు అక్కడికి వచ్చి ఆమె చేతి వంట రుచి చూసేవారు దీంతో ఈమె మంచి పాపులర్ అవ్వడమే కాకుండా తన బిజినెస్ కూడా మరింత పెరిగింది. ఇక ఈమె నాన్న బుజ్జి చిన్ను అంటూ అందరిని ప్రేమగా పలకరిస్తూ తన బిజినెస్ లో పెంచుకుంటూ పోతున్నారు. ఇక ఈమె బిజినెస్ పట్ల సోషల్ మీడియాలో ఎన్నో రకాలు రీల్స్ కూడా వచ్చాయి. ఇలా కుమారి ఆంటీ రోజురోజుకు ఎంతో పాపులర్ అవుతున్నటువంటి తరుణంలో బుల్లితెర నటి బిగ్ బాస్ బ్యూటీ కీర్తి భట్ ఈమె బిజినెస్ పై భారీ దెబ్బ కొట్టారని తెలుస్తుంది.. తాజాగా ఈమె తనకు కాబోయే భర్త విజయ్ కార్తీక్ తో కలిసి కుమారి ఆంటీ వద్ద ఫుడ్ టేస్ట్ చేశారట అయితే వీరు వెళ్లినప్పుడు కుమారి ఆంటీ లేదని వీళ్ళు కేవలం వైట్ రైస్ అలాగే ఒక నాన్ వెజ్ కర్రీ మాత్రమే తీసుకున్నారని తెలిపారు.

ఇలా మేము తీసుకున్నటువంటి ఆ ఫుడ్ ఒక ముద్ద నోట్లో పెట్టుకోగానే అసలు ఏ మాత్రం బాగలేదని వెంటనే దానిని పడేసి మరొక ఫుడ్ స్టాల్ వద్ద మేము ఫుడ్ తీసుకున్నామని అక్కడ కాస్త బెటర్ గా ఉందని కీర్తి తెలిపారు. కుమారి ఆంటీ కంటే నేనే చాలా బెటర్ గా వంట చేస్తానని కీర్తి తెలిపారు. అంతేకాకుండా వైట్ రైస్ నాలుగు చికెన్ ముక్కలు వేయించుకున్నాము. దానికే 170 బిల్లు వేశారని ఇది చాలా ఎక్కువ అంటూ ఈ సందర్భంగా కీర్తి చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇలా ఈమె ఈ వీడియో చేయడంతో ఒక్కసారిగా తన ఫుడ్ బిజినెస్ పై భారీగా దెబ్బ పడిందని చెప్పాలి.

Read More: వారిద్దరే నాకు స్ఫూర్తి.. మృణాల్ కామెంట్స్ వైరల్!

ట్రెండింగ్ వార్తలు