ఆ నమ్మకం లేకపోతే సినిమా తీసి ప్రయోజనం ఉండదు : షాహిద్ కపూర్

February 9, 2024

ఆ నమ్మకం లేకపోతే సినిమా తీసి ప్రయోజనం ఉండదు : షాహిద్ కపూర్

బాలీవుడ్‌ స్టార్ హీరో షాహిద్‌ కపూర్‌, కృతిసనన్‌ జంటగా నటించిన తాజా చిత్రం తేరీ బాతో మే ఐసా ఉల్జా జియా. కాగా ఈ సినిమాతో అమిత్‌ జోషి, ఆరాధన సాహ్‌ దర్శకులుగా పరిచయం అవుతున్నారు. తాజాగా ఈ సినిమా విడుదల అయ్యింది. ఈ సందర్భంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న హీరో షాహిద్‌ పలు ఆసక్తికర వాఖ్యలు వాఖ్యలు చేసారు. కాగా ఈ సందర్బంగా షాహిద్ కపూర్ మాట్లాడుతూ.. ఈ సినిమా కథ మొదటిసారి విన్నప్పుడు చాలా కొత్తగా అనిపించింది. ఇప్పుడున్న సాంకేతిక పరిజ్ఞానానికి తగ్గ చిత్రమిది అని అనుకున్నాను. కొత్తదనంతో నిండిన ఒక అందమైన, అసాధ్యమైన ప్రేమకథ ఇది.

ఒక సాధారణ వ్యక్తికి రోబో పట్ల కలిగే ప్రేమను ఎంతో అందంగా చూపించారు దర్శకనిర్మాతలు. ప్రేమకథా చిత్రాలనే చూస్తూ పెరిగాను. మంచి పాటలతో, విజువల్స్‌తో వచ్చిన ఆ జానర్‌ సినిమాలే థియేటర్లలో బాగా ఆడతాయని అనుకునేవాణ్ని. నాకు కూడా అలాంటి ప్రేమకథ సినిమాలు చూడటమే ఇష్టం. ఎక్కువ ప్రేమ పాటలు వినడానికే ఇష్టపడతాను. నేను థియేటర్లో చూసిన తొలి చిత్రం గులామ్‌ విన్న మొదటి పాట కభీ ఖుషీ కభీ ఘమ్‌ లోని షావా షావా. ఏదైన సినిమా చూస్తున్నప్పుడు అందులో ఏదో ఒక మ్యాజిక్‌ కనిపించాలి. వినే పాటలో లీనమైపోవాలి. విజువల్స్‌ చూస్తున్నప్పుడు చప్పట్లు, ఈలలు వేయాలనే అనుభూతి కలగాలి. కానీ ప్రేక్షకులు ఎప్పటికీ వాటినే గుర్తుపెట్టుకోవాలని లేదు.

రోజులు మారినకొద్ది రుచులు మారిపోతుంటాయి. వాటన్నింటినీ మేళవించి ఈ సినిమాలో చూపించడానికి ప్రయత్నించాము. ఈ సినిమాతో అందరినీ మెప్పించగలమనే నమ్మకం ఉంది. ఆ నమ్మకం లేకపోతే సినిమా చేయడం వల్ల ప్రయోజనం ఉండదు. ఈ సరికొత్త ప్రేమకథతో ఆ నమ్మకం కలిగింది. మేము దానిని భిన్నంగా చూపించాము. ఇది ప్రేమకథతో పాటు మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ కూడా.. ప్రేక్షకులు ఏ జానర్‌లో వచ్చిన సినిమానైనా చూస్తారు. కథ నచ్చితే చాలు. జానర్‌ ఏదైనా నటీనటులు మంచి కథలను ఎంచుకోవాలి. అభిమానులకు చూపించదగ్గ కథ ఇదని అనుకోవాలి. ఎలాంటి కథ ఐతే వారిని ఆకట్టుకుంటుందని ప్రేక్షకుల దృష్టితో ఆలోచించాలి. ఈ సినిమా కోసం మా చిత్రబృందం అంతా ఆ కోణంలోనే ఆలోచించిందని నా అభిప్రాయం అని తెలిపారు.

Read More: ఫిట్నెస్ కోసం చెమటలు చిందిస్తున్న శ్రద్ధాదాస్.. ఫోటోస్ చూస్తే ఆహా అనాల్సిందే!

ట్రెండింగ్ వార్తలు