గీతాంజలి మళ్లీ వచ్చింది ట్రైలర్ రిలీజ్.. ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన డైరెక్టర్ బాబి!

April 4, 2024

గీతాంజలి మళ్లీ వచ్చింది ట్రైలర్ రిలీజ్.. ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన డైరెక్టర్ బాబి!

2014లో కామెడీ హర్రర్ జోనర్ లో వచ్చిన గీతాంజలి సినిమా ఎంత పెద్ద సక్సెస్ అయిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాతో మంచి హిట్ ని అందుకున్న నటి అంజలి ఆ సినిమాకి సీక్వెల్ గా ఇప్పుడు గీతాంజలి మళ్లీ వచ్చింది అనే సినిమా తో మన ముందుకి వస్తుంది. డైరెక్టర్ కోన వెంకట్ ఈ సినిమాకి కథ, స్క్రీన్ ప్లే అందించగా శివ తుర్లపాటి డైరెక్షన్ చేస్తున్నారు.

నటుడు శ్రీనివాసరెడ్డి హీరోగా నటించిన ఈ సినిమా ఏప్రిల్ 11వ తేదీన రిలీజ్ కాబోతుంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ని మేకర్స్ విడుదల చేశారు. ఆద్యంతం నవ్వుతూ భయపెట్టే ఈ ట్రైలర్ సినిమాపై భారీగా అంచనాలను పెంచేసింది. తాజాగా ఈ ట్రైలర్ పై యంగ్ డైరెక్టర్ బాబి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. గీతాంజలి మళ్లీ వచ్చింది ట్రైలర్ ఫన్ థ్రిల్లర్ లాగా ఉంది. కోన వెంకట్ గారు మరియు మొత్తం టీం కి బెస్ట్ విషెస్.

ఏప్రిల్ 11న విడుదలవబోయే ఈ సినిమా కోసం తాను కూడా ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నట్లు ట్విట్టర్ ద్వారా ఒక పోస్టు పెట్టారు. ఇక ఈ ట్వీట్ తో సినిమాపై మరిన్ని అంచనాలు పెరగటం ఖాయం. బాబి ప్రెసెంట్ నందమూరి బాలకృష్ణ 109వ సినిమాకి డైరెక్ట్ చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇక గీతాంజలి మళ్లీ వచ్చింది సినిమా విషయానికి వస్తే..

ఈ సినిమాలో సత్యం రాజేష్, సత్య, షకలక శంకర్, అలీ, బ్రహ్మాజీ, రవిశంకర్, రాహుల్ మాధవ్ సహా పలువురు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఎంవివి సినిమాస్ బ్యానర్ తో కలిసి కోన ఫిలిం కార్పొరేషన్ బ్యానర్ పై కోన వెంకట్ ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. నటి అంజలి కెరియర్ లో ఈ సినిమా 50వ సినిమా కావటం విశేషం. ఈ సినిమా హిట్ అయితే ఆమెకి తెలుగులో మరిన్ని అవకాశాలు వచ్చే అవకాశం ఉంది.

Read More: అదే డేట్ కి వచ్చేస్తున్న పవన్ కళ్యాణ్ ఓజీ.. మరోసారి క్లారిటీ ఇచ్చిన నిర్మాత డివివి దానయ్య!

ట్రెండింగ్ వార్తలు