రష్మికపై ఫైర్ అవుతున్న సౌందర్య ఫ్యాన్స్?

February 1, 2024

రష్మికపై ఫైర్ అవుతున్న సౌందర్య ఫ్యాన్స్?

సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో నటి రష్మిక మందన్న ఒకరు. కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి హీరోయిన్గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినటువంటి ఈమె ప్రస్తుతం తెలుగు తమిళ భాష చిత్రాలలో మాత్రమే కాకుండా హిందీ భాష సినిమాలలో కూడా నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినటువంటి రష్మికకు అల్లు అర్జున్ సరసన పుష్ప సినిమాలో నటించే అవకాశం వచ్చింది.

ఇలా పుష్ప సినిమాలో ఈమె డి గ్లామర్ పాత్రలో నటించారు. ఈ సినిమాలో రష్మిక నటనకు అందరూ ఫిదా అయ్యారు. అంతేకాకుండా ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో రష్మిక కెరియర్ పూర్తిగా టర్న్ అయింది అని చెప్పాలి. ఈ సినిమా నుంచి ఈమెకు పెద్ద ఎత్తున బాలీవుడ్ సినిమా అవకాశాలు కూడా వస్తున్నాయి. ప్రస్తుతం హీరోయిన్ గా వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నటువంటి రష్మిక ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.

ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఈమె సౌందర్య బయోపిక్ చిత్రం గురించి మాట్లాడారు సౌందర్య అంటే తనకు చాలా ఇష్టమని తెలిపారు. అంతేకాకుండా చిన్నప్పుడు నేను సౌందర్య పోలికలతో ఉన్నాను అంటూ తన తండ్రి తనని పొగిడే వారిని రష్మిక తెలిపారు. తనకు అవకాశం కనుక వస్తే తప్పకుండా సౌందర్య బయోపిక్ సినిమాలో నటిస్తాను అంటూ ఈమె చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

ఇలా రష్మిక సౌందర్య గురించి చేసిన ఈ కామెంట్లపై కొందరు సమర్థించగా మరికొందరు మాత్రం విమర్శలు చేస్తున్నారు. సౌందర్య ఒక లెజెండరీ యాక్ట్రెస్ ఆమె పేరు పలకడానికి కూడా నీకు అర్హత లేదు అంటూ కామెంట్ చేయక మరికొందరు సౌందర్య అంటావేంటి ఇలా ఏక వచనంతో కాదు సౌందర్య గారు అని పిలువు అంటూ సౌందర్య ఫ్యాన్స్ రష్మికను ట్రోల్ చేస్తున్నారు.

ఇక రష్మిక విషయానికి వస్తే ప్రస్తుతం ఈమె వర్షం సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు త్వరలోనే పుష్ప సీక్వెల్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు ఈ సినిమా ఆగస్టు 15వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది ఈ సినిమాతో పాటు తమిళంలోనూ అలాగే హిందీ భాషలోనూ పలు సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు.

Read Moreవాయిదా పడిన దేవర షూటింగ్.. మళ్లీ మొదలయ్యేది అప్పుడేనా?

ట్రెండింగ్ వార్తలు