అట్లీ కాంబినేషన్లో రాబోతున్న సినిమాకి ముహూర్తం ఫిక్స్!

March 15, 2024

అట్లీ కాంబినేషన్లో రాబోతున్న సినిమాకి ముహూర్తం ఫిక్స్!

అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి ఏప్రిల్ 8న ఒక బర్త్డే గిఫ్ట్ ఇవ్వబోతున్నాడు ఐకాన్ స్టార్. అదేమిటంటే అట్లీ డైరెక్షన్ లో అల్లు అర్జున్ హీరోగా వస్తున్న సినిమాకి సంబంధించిన ప్రకటన ఆరోజు రివీల్ చేయబోతున్నట్లు సమాచారం. అట్లీ గత ఏడాది షారుక్ ఖాన్ తో చేసిన జవాన్ మూవీ తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ఇప్పుడు తొలిసారి అల్లు అర్జున్ సినిమా ద్వారా టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.

సన్ పిక్చర్స్ సంస్థ ఈ సినిమాని ప్రొడ్యూస్ చేయబోతున్నట్లు సమాచారం. ఈ సినిమా కోసం బన్నీ 120 కోట్లు డిమాండ్ చేశాడని తెలుస్తుంది. అయితే బన్నీకి ఉన్న క్రేజ్ దృష్టిలో పెట్టుకొని మేకర్స్ ఆ రెమ్యూనరేషన్ ఇవ్వటానికి రెడీ అయిపోయారంట. ఇక ఈ సినిమాకి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించనున్నట్లు సమాచారం.

ప్రస్తుతం సర వేగంగా షూటింగ్ జరుపుకుంటున్న పుష్ప 2 సినిమా ఆగస్టు 15, 2024న వరల్డ్ వైడ్ గా థియేటర్స్ లో విడుదల కాబోతుంది. ఈ సినిమాలో హీరోయిన్ గా రష్మిక మందన్న నటిస్తుంది. సునీల్, అనసూయ భరద్వాజ్, రావు రమేష్ తదితరులు కీలకపాత్రలో నటిస్తున్నారు.పుష్ప 2 మూవీలోని జాతర యాక్షన్ సీన్ కోసం దాదాపు 50 కోట్ల రూపాయలను ఖర్చు చేస్తున్నట్లు సమాచారం.

మొత్తంగా 25 నిమిషాల పాటు ఉండే ఈ ఒక్క ఎపిసోడ్ ని ఓ రేంజ్ లో డిజైన్ చేశారంట మూవీ టీం. ఆ తర్వాత అల్లు అర్జున్ త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్లో మరొక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం త్రివిక్రమ్ ఆ సినిమాని హోల్డ్ లో పెట్టారంట. అందుకే అల్లు అర్జున్ బోయపాటి శ్రీను తో సినిమా చేస్తున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమాని గీత ఆర్ట్స్ సంస్థ నిర్మించబోతుంది. వీటితోపాటు సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్లో కూడా నటించబోతున్నాడు అల్లు అర్జున్.

Read More: రజాకార్ మూవీ రివ్యూ అండ్ రేటింగ్.. సినిమా ఎలా ఉందంటే?

ట్రెండింగ్ వార్తలు