September 1, 2022
విక్రమ్ హీరో అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వంలో వచ్చిన చిత్రం ‘కోబ్రా’. శ్రీనిధి శెట్టి, మియా జార్జ్, మృణాళిని రవి, మీనాక్షీ చౌదరి, మలయాళ నటుడు రోషన్ మాథ్యూ, గోవింద రాజన్ ఈ సినిమాలో ఇతర ముఖ్య పాత్ర లు పోషించారు. ఆగస్టు 31న విడుదలైన ఈ సినిమాకు ప్రస్తుతం థియేటర్స్లో ఉంది. ఈ సినిమాకు మిక్డ్స్ రివ్యూస్ వస్తున్నాయి. అయితే ఈ సినిమా నిడివి ఎక్కువగా ఉందని, సాగదీత సన్నివేశాలు కూడా కొన్ని ఉన్నా యని రివ్యూవర్స్, ప్రేక్షకులు అభిప్రాయపడ్డారు. అయితే ఈ విషయంపై కోబ్రా టీమ్ స్పందించిన ఓ నిర్ణయాన్ని తీసుకుంది. ‘కోబ్రా’ సినిమా నిడివిని 20 నిమిషాలు తగ్గిస్తున్నట్లుగా సంచలన ప్రకటన చేసింది. అంతేకాదు నిడివి తగ్గించిన వెర్షన్ తాలుకూ ప్రింట్స్ సెప్టెంబరు 1 సాయంత్రం నుంచే థియేటర్స్లో ఉంటాయని వెల్లడించారు ఈ చిత్రం నిర్మాత లలిత్కుమార్. మరి..నిడివి తగ్గించిన అంశం కోబ్రా టీమ్కు కలిసొస్తుందా? లెట్స్ వెయిడ్ అండ్ సీ.