మోకాళ్ళ పై తిరుమల మెట్లు ఎక్కిన జాన్వీ కపూర్?

March 21, 2024

మోకాళ్ళ పై తిరుమల మెట్లు ఎక్కిన జాన్వీ కపూర్?

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ జాన్వీ కపూర్ తరచు తిరుమల వెళ్తూ ఉంటారనే సంగతి మనకు తెలిసిందే. ఈమె తనకు సంబంధించిన ఏ ముఖ్యమైన విషయం అయినా ముందుగా స్వామివారినే దర్శించుకున్న తర్వాతే అభిమానులతో పంచుకుంటారు అలాగే తన జీవితంలో ఇంపార్టెంట్ రోజులను కూడా స్వామివారి సన్నిధిలోనే జరుపుకుంటారు అనే సంగతి మనకు తెలిసిందే. ఇలా ఏడాదికి నాలుగైదు సార్లు ఈమె తిరుమల వెళ్లి స్వామి వారిని దర్శనం చేసుకుంటూ ఉంటారు.

ఇక బయట పెద్ద ఎత్తున గ్లామర్ షో చేస్తూ రచ్చ చేసే జాన్వీ కపూర్ ఆలయానికి మాత్రం చాలా సాంప్రదాయపద్ధంగా చీర కట్టుకొని లేదా లంగా వోని వేసుకొని స్వామివారిని దర్శించుకుంటారు. ఇకపోతే ఇటీవల మార్చి ఆరవ తేదీ ఈమె పుట్టినరోజు కావడంతో తిరుమల స్వామివారిని దర్శించుకున్న సంగతి మనకు తెలిసిందే అయితే తాజాగా తిరుమల వెళ్లిన విషయాలను ఈమె ఓ వీడియో రూపంలో తెలియజేశారు.

చెన్నై నుంచి మూడు గంటలపాటు కారులో ప్రయాణం చేస్తే తిరుమల చేరుకున్నామని తెలియజేశారు. ఇలా తిరుమల చేరుకున్నటువంటి ఈమె మెట్ల మార్గం గుండా తన బంధువులతో కలిసి కొండపైకి వెళ్లినట్లు తెలిపారు. ఈ క్రమంలోనే మోకాళ్ళ పర్వం వద్ద జాన్వీ కపూర్ మోకాళ్ళపై నడుస్తూ తిరుమల మెట్లు ఎక్కినట్లు తెలుస్తోంది. అయితే ఈమె ప్రతి ఏడాది ఎన్నో సార్లు ఈ ఆలయానికి వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు ఈ క్రమంలోనే ఇప్పటివరకు తాను ఒక 50 సార్లు తిరుమల స్వామివారిని దర్శించుకున్నానని తెలిపారు.

నాకు తిరుమల స్వామి వారు అంటే ఎంతో ఇష్టమని అందుకే నాకు సంబంధించిన కీలకమైన విషయాలలోనూ ముఖ్యమైన పనులు చేసే సమయంలోను స్వామివారి దర్శనం తప్పనిసరిగా తీసుకుంటానని తెలిపారు. ఇకపోతే ఇటీవల ఈమె హైదరాబాద్లో రామ్ చరణ్ బుచ్చిబాబు సినిమా పూజ కార్యక్రమాలలో పాల్గొని సందడి చేసిన సంగతి తెలిసిందే.

Read More: ఇంస్టాగ్రామ్ లో మరో రికార్డ్ సాధించిన బన్నీ.. థాంక్యూ అంటూ పోస్ట్?

ట్రెండింగ్ వార్తలు