సూపర్ స్టార్ మహేశ్ బాబు.. దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్లో సినిమా కోసం ఇద్దరి అభిమానులు చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. మహేష్ ప్రస్తుతం సర్కారు వారి పాట ఆ తర్వాత త్రివిక్రమ్ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే.. త్రివిక్రమ్ సినిమా తర్వాత రాజమౌళి దర్శకత్వంలో నటించనున్నాడు మహేష్. మోస్ట్ అవెయిటెడ్ కాంబో కావడంతో ఈ ప్రాజెక్టుపై అప్పుడే ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. వాటన్నింటికి ధీటుగా ఉండేలా కథను రెడీ చేస్తున్నాడంట రాజమౌళి. దాదాపుగా ఈ సినిమాలో మహేశ్ జేమ్స్బాండ్ తరహా క్యారెక్టర్లో కనిపించనున్నారని సమాచారం. అయితే ఈ సినిమాలో ఓ స్టార్ హీరో విలన్గా నటించనున్నాడనే వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ సినిమాలో మహేశ్ బాబును ఢీకొట్టే పవర్ఫుల్ విలన్ పాత్రలో కోలీవుడ్ స్టార్ హీరో విక్రమ్ నటించబోతున్నాడట. ఇప్పటికే చిత్ర యూనిట్ ఆయనతో సంప్రదింపులు కూడా జరిపిందనే టాక్ వినిపిస్తోంది. పాన్ ఇండియా సినిమా కావడం, తన క్యారెక్టర్కి కూడా మంచి ఇంపార్టెన్స్ ఉండడంతో ఈ కథ ఓకే చేశారట విక్రమ్. మహేశ్ ది జేమ్స్బాండ్ క్యారెక్టర్ కాగా అతన్ని ఢీ కొట్టే స్టైలిష్ విలన్ పాత్రలో విక్రమ్ నటించనున్నాడని సమాచారం.