దొరికిన ఈ గ్యాప్‌ని కూడా వదలడం లేదా?.. మహేష్ బాబు మామూలోడు కాదెహే

January 9, 2024

దొరికిన ఈ గ్యాప్‌ని కూడా వదలడం లేదా?.. మహేష్ బాబు మామూలోడు కాదెహే

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా కెరియర్ పరంగా ఇండస్ట్రీలో ఎంతో బిజీగా ఉన్నారు. ఇలా నటుడుగా వరుస సినిమాలలో నటిస్తున్నటువంటి మహేష్ బాబు మరోవైపు ఇంటర్నేషనల్ బ్రాండ్స్ కూడా ప్రమోట్ చేస్తూ భారీగానే సంపాదిస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఇప్పటివరకు టాలీవుడ్ ఇండస్ట్రీలో మహేష్ బాబు ప్రమోట్ చేస్తున్నటువంటి బ్రాండ్స్ మరే హీరో కూడా ప్రమోట్ చేయడం లేదని చెప్పాలి.

ఇలా ఈయన ఒక్కొక్క బ్రాండ్ ప్రమోట్ చేయడం కోసం భారీ స్థాయిలోనే రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు. ఇలా ఒక వైపు సినిమాలు మరొకవైపు పలు బ్రాండ్లను ప్రమోట్ చేస్తూ మహేష్ బాబు రెండు చేతుల సంపాదిస్తున్నారని చెప్పాలి. ఇవి కాకుండా మరి ఈయనకు బిజినెస్ లు కూడా ఉన్న విషయం మనకు తెలిసిందే. ఇదిలా ఉండగా తాజాగా ఈయన మరొక బ్రాండ్ ప్రమోషన్ కి సంబంధించిన షూటింగ్ పూర్తి చేశారు అంటూ ఈయన సతీమణి నమ్రత సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.

Read More : HanuMan Trailer: ట్రైలర్ కంటే సినిమా పదిరెట్లు అద్భుతంగా వుంటుంది – ప్రశాంత్ వర్మ

మహేష్ బాబు గుంటూరు సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను వేగంగా నిర్వహిస్తున్నారు. ఒకవైపు ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో బిజీగా ఉన్నప్పటికీ మరోవైపు మౌంటెన్ డ్యూ కూల్ డ్రింక్ ప్రమోషన్లలో భాగంగా షూటింగ్స్ కూడా నిర్వహిస్తూ ఉన్నారు. తాజాగా ఈ మౌంటెన్ డ్యూ కూల్ డ్రింక్ ప్రమోషన్ కి సంబంధించినటువంటి షూటింగ్ నిర్వహించారు. ఇది కాస్త పూర్తి కావడంతో ఇందుకు సంబంధించినటువంటి ఫోటోలను నమ్రత సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఇది పూర్తి అయ్యింది గుంటూరు పిలుస్తోంది అంటూ ఈమె ఈ ఫోటోలను అభిమానులతో పంచుకున్నారు.

ఇక జూన్ 9వ తేదీ సాయంత్రం గుంటూరులో తను నటిస్తున్నటువంటి గుంటూరు కారం సినిమా ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఇక మహేష్ బాబు ఈ కొంత గ్యాప్ లోనే ఈ యాడ్ షూటింగ్ పూర్తి చేయడంతో పలువురు నెటిజన్స్ వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. మీకు దొరికిన ఈ చిన్న గ్యాప్ కూడా మీరు వదలడం లేదు కదా అంటూ కొందరు కామెంట్లు చేయగా మహేష్ బాబు మామూలోడు కాదు సమయాన్ని అస్సలు వేస్ట్ చేయడం లేదుగా అంటూ మరికొందరు కామెంట్లు చేస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు