మీ అరుపులు వాళ్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తించాలి..ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నాగబాబు పొలిటికల్ సెటైర్స్!

February 27, 2024

మీ అరుపులు వాళ్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తించాలి..ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నాగబాబు పొలిటికల్ సెటైర్స్!

మెగా బ్రదర్ నాగబాబు జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తున్న సంగతి మనకు తెలిసిందే. మరి కొద్ది రోజులలో ఏపీలో ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున ఎన్నికల హడావిడి కొనసాగుతుంది. ఇక నాగబాబు అనకాపల్లి నియోజకవర్గం నుంచి ఎంపీగా పోటీ చేయబోతున్నట్లు కూడా ప్రకటించారు. ఈ క్రమంలోనే ఈయన ఎన్నికల హడావిడిలో ఎంతో బిజీగా మారిపోయారు. ఇకపోతే తాజాగా నాగబాబు తన కుమారుడు వరుణ్ తేజ్ నటించిన ఆపరేషన్ వాలెంటైన్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

ఇక ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవితో పాటు నాగబాబు కూడా ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా నాగబాబు మాట్లాడుతూ పొలిటికల్ సెటైర్స్ వేశారు. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా నాగబాబు పవన్ కళ్యాణ్ పేరు ఎత్తగానే ఒక్కసారిగా అక్కడ ఉన్నటువంటి అభిమానులు పెద్ద ఎత్తున కేకలు వేస్తూ అరిచారు దీంతో నాగబాబు అరవండి ఇంకా బాగా అరవండి ఈ అరుపులు వాళ్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తించాలి అంటూ కామెంట్లు చేశారు.

ఇప్పుడే తాను పవన్ కళ్యాణ్ ని కలిసి వస్తున్నానని నాగబాబు తెలిపారు. ఇలా నాగబాబు మాట్లాడిన కూడా అభిమానులు అరుపులు ఆపకపోవడంతో నాగబాబు మాట్లాడుతూ.. మీ ఎనర్జీ మొత్తం ఓట్లు గుద్దడంలో చూపించండి అంటూ ఈ సందర్భంగా రాజకీయాల ప్రస్తావన కూడా తీసుకోవచ్చారు. ఇలా నాగబాబు మాట్లాడిన అనంతరం ఇండియన్ ఆర్మీ గొప్పతనం గురించి కూడా ఈయన ఈ సందర్భంగా మాట్లాడటమే కాకుండా యుద్ధంలో మరణం పొందినటువంటి అమరజవానుల కుటుంబాల కోసం ఆరు లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సహాయాన్ని చిత్ర బృందం నేరుగా వాళ్లకు అందజేస్తారని ఈ సందర్భంగా నాగబాబు చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Read More: నయనతార సక్సెస్ సీక్రెట్ అదేనా.. ఇన్ని రోజులకు బయటపడిన నిజం?

ట్రెండింగ్ వార్తలు