Chiranjeevi: ఇంతకంటే నాకు కావాల్సిందేముంది.. టాలెంట్ ఒకరి సొత్తు కాదు: చిరంజీవి

February 26, 2024

Chiranjeevi: ఇంతకంటే నాకు కావాల్సిందేముంది.. టాలెంట్ ఒకరి సొత్తు కాదు: చిరంజీవి

వరుణ్ తేజ్ హీరోగా, మానుషీ చిల్లర్ హీరోయిన్ గా దర్శకుడు శక్తి ప్రతాప్ సింగ్ రూపొందించిన ఆపరేషన్ వాలెంటైన్ సినిమా మార్చి ఒకటిన విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా హైదరాబాదులో ఆదివారం ఒక వేడుక నిర్వహించింది మూవీ టీం. ఈ వేడుకకి ముఖ్యఅతిథిగా చిరంజీవి హాజరయ్యారు.

వరుణ్ తేజ్ గురించి మాట్లాడుతూ రియల్ హీరోలపై తీసిన చిత్రం గురించి నువ్వు చెబితే ప్రజలకి బాగా రీచ్ అవుతుంది అని నాతో చెప్పినప్పుడు మనల్ని రక్షించే వారియర్స్ గురించి చెప్పడం నాకు దక్కిన గొప్ప అవకాశం గా భావిస్తున్నాను అని చెప్తూ ఈ వేడుకకు రావటం గర్వంగా ఉంది అని చెప్పారు చిరంజీవి.నటుడిగా వరుణ్ నన్ను ఎప్పుడు ఫాలో కాలేదు ముందు నుంచి విభిన్న కథలు ఎంపిక చేసుకుంటూ వస్తున్నాడు.

మా కుటుంబ హీరోల్లో ఎవరికీ రాని అవకాశాలు వరుణ్ కి వచ్చాయి. ఎయిర్ ఫోర్స్ పై టాలీవుడ్ లో తెరకెక్కిన తొలి చిత్రం ఇదే. గత ఏడాది హాలీవుడ్ లో టాప్ గర్ల్ లోని విజువల్స్ ని చూసి ఇలాంటిది మనం తీయగలమా అనుకున్నాను. ఆపరేషన్ వాలెంటైన్ అదే స్థాయిలో ఉంది టాలెంట్ ఎవరు సొత్తు కాదు అని పేర్కొన్నారు చిరంజీవి. అలాగే నవదీప్ గురించి మాట్లాడుతూ అతను కూడా మా కుటుంబ సభ్యుడు లాంటి వాడే, దృవ సినిమాలో అతని నటన నాకు చాలా ఇష్టం అని చెప్పారు చిరంజీవి.

అలాగే డైరెక్టర్ గురించి మాట్లాడుతూ శక్తి ప్రతాప్ మంచి పారితోషకంతో కమర్షియల్ డైరెక్టర్ గా ఇక్కడ స్థిరపడిపోవచ్చు అనే ఉద్దేశంతో రాలేదు, తన సొంత ఖర్చుతో సర్జికల్ స్ట్రైక్ పై షార్ట్ ఫిలిం తీశాడు. ఈ షార్ట్ ఫిలిం చూసిన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ షాక్ అయింది, ఈసారి సినిమా తీస్తే మరింత సమాచారం ఇస్తామంటూ ఆయనని ప్రోత్సహించింది అని చెప్పారు చిరంజీవి. ఇదే వేదిక మీద పద్మ విభూషణ్ అవార్డు వరించిన సందర్భంగా చిరంజీవిని గజమాలతో సత్కరించింది మూవీ టీం.

Read More: Shah Rukh Khan: అల్లు అయాన్‌ సింగింగ్‌ను మెచ్చిన షారుక్‌.. బన్నీ ఏమన్నారంటే?

ట్రెండింగ్ వార్తలు