టాలీవుడ్ డైరెక్టర్లకు ఇన్ డైరెక్ట్ గా క్లాస్ పీకిన మెగాస్టార్.. అందరూ ఆలోచించాలి అంటూ?

February 27, 2024

టాలీవుడ్ డైరెక్టర్లకు ఇన్ డైరెక్ట్ గా క్లాస్ పీకిన మెగాస్టార్.. అందరూ ఆలోచించాలి అంటూ?

మెగాస్టార్ చిరంజీవి ఇటీవల మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా నటించిన ఆపరేషన్ వాలంటైన్ అనే సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ కార్యక్రమంలో భాగంగా మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ చేస్తున్నటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఇటీవల కాలంలో చిరంజీవి దర్శకులను ఉద్దేశించి పరోక్షంగా కామెంట్లు చేస్తూ ఉంటారు అయితే తాజాగా టాలీవుడ్ డైరెక్టర్లపై ఈయన మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఈ సందర్భంగా చిరంజీవి ఆపరేషన్ వాలెంటైన్ సినిమా గురించి మాట్లాడుతూ ఈ సినిమాకు శక్తి ప్రతాప్ సింగ్ దర్శకుడిగా వ్యవహరించారు ఈయన ఎంతో అద్భుతంగా ఈ సినిమాని చూపించారని తెలిపారు ఇటీవల విడుదల చేసిన ట్రైలర్ లో విమాన విన్యాసాలు చాలా అద్భుతంగా చూపించారని, ఇంత తక్కువ బడ్జెట్లో ఇంత నాణ్యమైన సినిమా ఎలా చేశారని ఆశ్చర్యపోయాను అంటూ చిరంజీవి తెలిపారు ఈ సినిమాని కేవలం 75 రోజుల్లోనే పూర్తి చేశారని వెల్లడించారు.

డబ్బు ఖర్చు పెడితేనే సినిమాకు రీచ్ నెస్ రాదు. తక్కువ బడ్జెట్ తో కూడా ఇలా సినిమా చేసి దానిని ఎలా రిచ్ గా చూపించాలో దర్శకులు అందరూ ఆలోచించాలని ఈయన తెలిపారు. ఇలా దర్శకులు ఆలోచించినప్పుడే నిర్మాత బాగుంటాడు ఇండస్ట్రీ బాగుంటుంది శక్తి ప్రతాప్ సింగ్ మన టాలీవుడ్ డైరెక్టర్లు స్ఫూర్తిగా తీసుకోవాలి అంటూ ఈ సందర్భంగా చిరు చేసిన ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

ఈ విధంగా చిరంజీవి టాలీవుడ్ దర్శకులను ఉద్దేశిస్తూ ఇలాంటి కామెంట్లు చేయడంతో పలువురు ఈయన వ్యాఖ్యలపై వివిధ రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. అయితే ఆచార్య సినిమా సమయం నుంచి చిరంజీవి ఇలా దర్శకుల పట్ల అవకాశం వచ్చిన ప్రతిసారి కామెంట్లు చేస్తూనే ఉన్నారు. ఆచార్య సినిమా ఎక్కువ బడ్జెట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయిందనే విషయం మనకు తెలిసిందే.

Read More: Shah Rukh Khan: అల్లు అయాన్‌ సింగింగ్‌ను మెచ్చిన షారుక్‌.. బన్నీ ఏమన్నారంటే?

ట్రెండింగ్ వార్తలు