January 13, 2024
టాలీవుడ్ పాన్ ఇండియా హీరో ప్రభాస్ ఇటీవలె సలార్ సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే. భారీ అంచనాలను నడుమ విడుదలైన ఈ సినిమా కోట్లల్లో కలెక్షన్స్ రాబట్టింది. ప్రస్తుతం ఇంకా పలుచోట్ల సక్సెస్ఫుల్గా ప్రదర్శితం అవుతోంది. బాహుబలి సినిమా తర్వాత వరుసగా ఫ్లాప్స్ ని ఎదుర్కొన్న ప్రభాస్ కు ఈ సినిమా కాస్త ఊరట నిచ్చింది. కాగా ప్రభాస్ ప్రస్తుతం ఈ సినిమా సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నారు. ఈ సినిమా మంచి సక్సెస్ ని సాధించిన సందర్భంగా డార్లింగ్ ప్రభాస్ తాజాగా బయట కనిపించడం మాత్రమే కాకుండా అమ్మవారి ఆలయంలో ప్రత్యేకంగా పూజలు కూడా నిర్వహించారు.
ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫొటోస్ వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో డార్లింగ్ అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. కాగా సలార్ చిత్ర బృందం తాజాగా కర్ణాటకలోని దుర్గాపరమేశ్వరి ఆలయాన్ని సందర్శించింది. హీరో ప్రభాస్, హోంబలే ప్రొడక్షన్ కంపెనీ యజమాని సలార్ చిత్ర నిర్మాత విజయ్ కిర్గందూర్తో పాటు పలువురు సినీ ప్రముఖులు శుక్రవారం మంగళూరు క్షేత్రంలోని దుర్గాపరమేశ్వరి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. దుర్గాపరమేశ్వరి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు ప్రభాస్ కు దేవస్థానం అమ్మవారి విగ్రహాన్ని బహూకరించి ఘనంగా సత్కరించారు.
మామూలుగా ప్రభాస్ మనకు పెద్దగా బయట కనిపించడు. సలార్ సినిమా ప్రమోషన్స్ సమయంలో కూడా ఒకటి రెండు ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. అలాంటిది ఇప్పుడు ఏకంగా అమ్మవారి గుడిలో ప్రత్యేకంగా తెల్లటి మాస్క్ ధరించి పూజలు నిర్వహించడంతో ప్రభాస్ అభిమానులు ఆశ్చర్య వ్యక్తం చేస్తున్నారు. అందుకు సంబంధించిన ఫోటోలను కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే మీరు కూడా ఆ ఫోటోలను వీడియోలను చూసేయండి.
. #Prabhas @ Kateel Temple. He walked a lot may divine listens to him & bestow him whatever his desires are 🤲♥️ pic.twitter.com/uZ6w5By1Xg
— Ace in Frame-Prabhas (@pubzudarlingye) January 12, 2024
May the force be with u always !
— Ace in Frame-Prabhas (@pubzudarlingye) January 12, 2024
.#Prabhas 🤲 pic.twitter.com/luGV7WOxNv
Read More: తొలిరోజు ఏకంగా అన్ని కోట్లు సాధించిన మహేష్ బాబు గుంటూరు కారం సినిమా?