మాట నిల‌బెట్టుకుంటున్న ప్ర‌భాస్..ఖుషీలో ఫ్యాన్స్‌

January 26, 2024

మాట నిల‌బెట్టుకుంటున్న ప్ర‌భాస్..ఖుషీలో ఫ్యాన్స్‌

సాధార‌ణంగా స్టార్ హీరోలు త‌మ అభిమానుల‌కు ఇచ్చిన మాట‌ను ఎక్కువ‌గా త‌ప్పుతుంటారు. అభిమానులు కూడా ప‌రిస్థితుల‌ని అర్ధం చేసుకుని వాటిని ఓపిక‌గా భ‌రిస్తూ ఉంటారు. కేవ‌లం బాహుబ‌లి కోసం ఐదేళ్లు సమయం కేటాయించారు రెబ‌ల్ స్టార్‌ ప్రభాస్‌. ఆ సమయం ప్రభాస్‌ కెరీర్‌కు ఎంతో పీక్‌. అయినా ఓపిగ్గా ఆ సినిమా కోసం వర్క్‌ చేశాడు. అంద‌రి క‌ష్టం ఫ‌లించింది.. ‘బాహుబలి’ సినిమా బ్లాక్‌బస్టర్ అయింది.. కానీ ఈ సినిమా విజయం, ప్రభాస్‌ తర్వాతి సినిమాల అంచనాలను భారీగా పెంచేశాయి. పాన్‌ ఇండియా మార్కెట్‌ అంటూ ఇతర భాషల్లో రిలీజ్‌ చేయడం, క్వాలిటీ పరంగా బడ్జెట్‌ పెరగడం వంటివి ప్రభాస్‌ సినిమాలకు థియేటర్స్‌కు వచ్చేందుకు ఆలస్యమైయ్యేలా కారణమైయ్యాయి.

అయితే బాహుబ‌లి త‌ర్వాత వ‌చ్చిన‌ సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్‌ సినిమాలు బాక్సాఫీస్‌ వద్ద బోల్తా కొట్టాయి. ‘ఆదిపురుష్‌’ సినిమా సమయంలో ప్రభాస్‌ ఫ్యాన్స్‌కు ఓ ప్రామిస్ చేశాడు. ఏంటంటే…ఇక నుంచి ఏడాదికి కనీసం రెండు, వీలైతే మూడు సినిమాలను థియేటర్స్‌లోకి తీసుకువస్తానని మాట ఇచ్చాడు ప్రభాస్‌. మాట ఇచ్చిన ప్ర‌కారం….2023లో ‘ఆదిపురుష్‌’, ‘సలార్‌:సీజ్‌ఫైర్‌’ రెండు సినిమాలు థియేటర్స్‌లోకి వచ్చాయి. ఈ ఏడాది అంటే 2024లో ‘కల్కి 2898 ఏడీ’, ‘రాజాసాబ్‌’, వీలైతే ‘సలార్‌ 2’ కూడా విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇక 2025లో సందీప్‌రెడ్డి వంగాతో ప్రభాస్‌ చేస్తున్న ‘స్పిరిట్‌’, హనురాఘవపూడితో చేయాల్సిన సినిమాలు విడుదల అవుతాయి. ఈ లోపు కొత్త లైనప్‌ను సెట్ చేసే ప‌నిలో ఉన్నాడు ప్రభాస్‌. ఇలా వరుస సినిమాలు చేయడం ప్రభాస్‌ ఫ్యాన్స్‌ను ఖుషీ చేస్తుంది.

ప్ర‌స్తుతం ప్ర‌భాస్ హీరోగా మారుతి ద‌ర్శ‌కత్వంలో తెర‌కెక్కుతోన్న రాజాసాబ్ విడుద‌ల‌కి ముందే లాభాల బాట‌లో న‌డుస్తోంది. ప్ర‌స్తుతం ప్ర‌భాస్‌కి ఉన్న మార్కెట్‌, ట్రేడ్ అంచ‌నాల ప్ర‌కారం ఈ సినిమాకు దాదాపు 50కోట్ల వ‌ర‌కూ టేబుల్ ప్రాఫిట్ వ‌చ్చే అవ‌కాశం ఉంది. దాంతో రిలీజ్‌కు ముందే హ్యాపీగా ఉంది చిత్ర యూనిట్..ఇక ఈ సినిమాలో ప్ర‌భాస్ ప‌క్కన న‌టించే హీరోయిన్ ఎవరా? అని చాలా కాలంగా చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి. తాజాగా ఈ సినిమాలో ప్ర‌భాస్ ప్ర‌క్క‌న శ్రీ‌లీల న‌టించ‌నుంద‌ని తాజా స‌మాచారం..

ట్రెండింగ్ వార్తలు