పదే పదే ఈ పదంతో నన్ను టార్గెట్ చేస్తున్నారు..నెటిజ‌న్‌పై యాంక‌ర్ ర‌ష్మి ఫైర్‌

January 24, 2024

పదే పదే ఈ పదంతో నన్ను టార్గెట్ చేస్తున్నారు..నెటిజ‌న్‌పై యాంక‌ర్ ర‌ష్మి ఫైర్‌

బుల్లితెర రారాణి యాంక‌ర్ ర‌ష్మి గౌత‌మ్ గురించి పెద్ద‌గా ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు..జబర్దస్త్ షో ద్వారా యాంకర్‌గా పరిచయమై యూత్‌లో మాత్రం భారీ క్రేజ్ సంపాదించుకుంది. అంతకు ముందు సినిమాల్లో నటించినా ఈ భామకు పెద్దగా గుర్తింపు రాలేదు. ఈ షో ద్వారా వచ్చిన క్రేజ్‌తో బిగ్ స్క్రీన్‌పై అప్పుడప్పుడు మెరుస్తోంది. ఇటీవ‌ల భోళా శంక‌ర్ స్పెష‌ల్ సాంగ్‌లో మెగాస్టార్ చిరంజీవితో క‌లిసి స్టెప్పులేసింది.

ఈ అమ్మ‌డు సోషల్ మీడియాలో ఎప్ప‌టిక‌ప్పుడు అప్‌డేట్‌గా ఉంటూ లేటెస్ట్‌ ఫొటో షూట్స్‌తో అభిమానులను అలరిస్తూ ఉంటుంది. ఇదిలావుంటే రష్మి (Rashmi) తాజాగా ఓ నెటిజన్‌పై ఆగ్రహం వ్యక్తం చేసింది.

అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవంపై ఆనందం వ్యక్తం చేస్తూ రష్మి ఇటీవల ఒక పోస్ట్ చేసింది. అయితే ఈ పోస్ట్‌పై ఓ నెటిజన్ రిప్లయ్ ఇస్తూ.. కాషాయపు రంగు చీర కట్టి.. అన్నీ చెడ్డ పనులు చేస్తున్నావు. అంటూ కాస్త అసభ్య పదజాలం వాడాడు. దీంతో రష్మికి కోపం వచ్చింది. ఆ ట్వీట్‌కు రిప్లై ఇస్తూ కాస్త గట్టిగానే కౌంటర్లు వేసింది.

”నేనేమైనా బిల్లులు కట్టకుండా డబ్బులు ఎగ్గొట్టానా? లేదా నా తల్లిదండ్రుల్ని రోడ్డున వదిలేశానా? నా కుటుంబ బాధ్యతలు తీసుకోలేదా?.. ట్యాక్సులు కట్టలేదా?.. నేనేమైనా అసాంఘిక కార్యకలాపాలు, అకృత్యాలు చేశానా? ఎవరి దగ్గరైనా డబ్బులు లాగేసుకున్నానా? మీ దృష్టిలో అసభ్యకరమైన పనులంటే ఏమిటి? ఈ మధ్య కాలంలో ఇలాంటి మాటలు ఎక్కువగా వింటున్నా. పదే పదే ఈ పదంతో నన్ను టార్గెట్ చేస్తున్నారు.. నా వరకు దేవుడి అందరి వాడు. సనాతన ధర్మంలోని మంచి విషయం అదే అంటూ రష్మి గౌతమ్ ఆ నెటిజెన్ కి గట్టి కౌంటర్ ఇచ్చింది. ప్ర‌స్తుతం ఈ రిప్లై సోష‌ల్‌మీడియాలో వైర‌ల్ అవుతోంది. ర‌ష్మీ ట్వీట్‌ని మీరు ఓ లుక్కేయండి.

Read More: మూడు భాగాలుగా రామాయన్.. రిలీజ్ ఎప్పుడంటే?

ట్రెండింగ్ వార్తలు