January 23, 2024
ఆదిపురుష్ తర్వాత బాలీవుడ్లో తెరకెక్కుతున్న మరో రామాయణంపై అందరి దృష్టి పడింది. దర్శకుడు నితేశ్ తివారీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించనున్న ఈ రామాయణ్లో రాముడిగా రణ్ బీర్ కపూర్, సీతగా సాయి పల్లవి, రావణుడిగా యష్ నటిస్తున్నారు. మ్యాసివ్ కాంబినేషన్ మూవీ కాబట్టి ఈ సినిమా గురించి రోజూ ఏదో ఒక విషయం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.
ఈ రామాయణ మూడు భాగాలుగా తెరకెక్కనుంది. అత్యంత అధునాతనమైన గ్రాఫిక్స్ ఈ సినిమాకు అదనపు ఆకర్షణ కానుంది. ఇప్పటికే రాముడి పాత్ర కోసం తన శరీరాన్ని మరింత దృడంగా మలుచుకుంటున్నాడంట రణ్బీర్..రావణాసురుడి పాత్రధారి యష్ ఫస్ట్ పార్ట్ కోసం కేవలం పదిహేను రోజులు కాల్ షీట్స్ ఇచ్చాడని తెలుస్తోంది..అంటే మొదటి భాగంలో రావణాసురిడి పాత్ర పరిమితంగా ఉందనుంది కావొచ్చు…రెండో భాగం కోసం ఎక్కువ డేట్స్ ఇచ్చేలా అంగీకారం కుదిరిందట.
ఈ రామాయణంలో దశకంఠుడి ఎంట్రీని క్లైమాక్స్లో చూపించి.. ఆ తర్వాత తెరకెక్కనున్న సీక్వెల్లో యష్ మీద ఎక్కువ కథ నడిచేలా కథను రాసుకున్నాడట నితీష్ తివారి. త్వరలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. ఫస్ట్ పార్ట్ 2025 మార్చిలో విడుదల కానుంది. ఈ ప్రస్టేజియస్ ప్రాజెక్ట్లో మరికొంత మంది స్టార్లు నటించే అవకాశం ఉంది.
Read More: దేవర అనుకున్న డేట్ కి రాగలడా?