September 5, 2022
వెండితెరపై శర్వానంద్ పాలిటిక్స్ చేయనున్నారు. ‘చల్ మోహనరంగ’ సినిమా తీసిన కృష్ణచైతన్య దర్శ కత్వంలో శర్వానంద్ ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రారంభోత్సవం సెప్టెంబరు 5న హైదరాబాద్లో జరిగింది. యూవీ క్రియేషన్స్ నిర్మాతలు వంశీ, ప్రమోద్లతో కలిసి దర్శకులు చందూ మొండేటి, సుధీర్ వర్మ, హనురాఘవపూడి ఈ సినిమా స్క్రిప్ట్ను దర్శకుడు కృష్ణ చైతన్యకు అందించారు. ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ క్లాప్ ఇవ్వగా, కృష్ణ చైతన్యయే తొలి సన్నివేశానికి దర్శకత్వం వహించారు.
పొలిటికల్ యాక్షన్ బ్యాక్డ్రాప్లో రూపొందనున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ అక్టోబరు నెల నుంచి ప్రారంభం కానుంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల ఈ సినిమాను నిర్మిస్తున్నారు. రాశీఖన్నా ఈ చిత్రంలో హీరో యిన్గా నటిస్తుండగా, హీరోయిన్ ప్రియమణి ఓ కీ రోల్ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. తమిళ దర్శకుడు యువన్ శంకర్రాజా ఈ సినిమాకు సంగీతం అందిస్తుండటం విశేషం. ఇక శర్వానంద్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘ఒకే ఒక జీవితం’ ఈ సెప్టెంబరు 9న థియేటర్స్లో రిలీజ్ కానుంది.
మరోవైపు ‘చల్మోహనరంగ’ చిత్రం తర్వాత నితిన్ కోసం కృష్ణచైతన్య ‘పవర్పేట’ అనే ఓ పొలిటికల్ యాక్షన్ ఫిల్మ్ను రెడీ చేశాడు. రెండు పార్టులుగా ఈ సినిమా రావాల్సింది. ఇందులో సత్యదేవ్ ఓ కీ రోల్అనే ప్రచారం కూడా జరిగింది. అయితే ఈ సినిమా సెట్స్పైకి వెళ్లలేదు. మరి..శర్వానంద్తో కృష్ణ చైతన్య తీస్తున్న సినిమా ‘పవర్పేట’ కథతోనా? లేక మరి ఏదైనా కొత్త కథ? అనే విషయంపై ఓ స్పష్టత రావాల్సి ఉంది.