బిగ్ బాస్ తర్వాత పల్లవి ప్రశాంత్ ఏం చేస్తున్నారో తెలుసా?

March 1, 2024

బిగ్ బాస్ తర్వాత పల్లవి ప్రశాంత్ ఏం చేస్తున్నారో తెలుసా?

బుల్లితెరపై ప్రసారమవుతున్నటువంటి అతిపెద్ద రియాలిటీ షో బిగ్ బాస్ కార్యక్రమం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ కార్యక్రమం ఇటీవల ఏడవ సీజన్ పూర్తి చేసుకుంది ఇక ఈ కార్యక్రమానికి కామన్ మ్యాన్ క్యాటగిరిలో భాగంగా ఒక రైతుబిడ్డ హౌస్ లోకి అడుగుపెట్టిన సంగతి మనకు తెలిసిందే. ఇలా కామన్ మాన్ గా హౌస్ లోకి వచ్చినటువంటి ఈయన ఏకంగా సెలబ్రిటీగా మారిపోవడమే కాకుండా బిగ్ బాస్ కప్ గెలుచుకొని సంచలనం సృష్టించారు.

ఇలా బిగ్ బాస్ విన్నర్ గా నిలిచినటువంటి ఈయనకు ఆ ఆనందం కొన్ని రోజులు కూడా లేకుండా పోయింది. అన్నపూర్ణ స్టూడియో బయట గ్రాండ్ ఫినాలే రోజు ఈయన అభిమానులు చేసినటువంటి హంగామా కారణంగా ప్రశాంత్ జైలుకు వెళ్లాల్సిన పరిస్థితిలు ఏర్పడ్డాయి. ఇలా రెండు రోజుల పాటు జైలులో ఉన్నటువంటి ఈయన అనంతరం బెయిల్ మీద బయటకు వచ్చారు.

ఇక ఒక కామన్ మ్యాన్ రైతుబిడ్డ అయినటువంటి పల్లవి ప్రశాంత్ సెలబ్రిటీ హోదాని అందుకున్నారు. ఈ క్రమంలోనే ఈయన వరుసగా ఇంటర్వ్యూలలో పాల్గొనడం అనంతరం బుల్లితెర కార్యక్రమాలలో కూడా సందడి చేస్తూ కనిపించారు. ఇకపోతే ఇటీవల కాలంలో రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ ఎక్కడా కనిపించడం లేదు. ఈయన బుల్లితెర కార్యక్రమాలకు కూడా దూరమయ్యారు. ఈ క్రమంలోనే పల్లవి ప్రశాంత్ ఏం చేస్తున్నారన్న సందేహాలు అందరికీ కలుగుతున్నాయి.

ఇక ప్రస్తుతం ప్రశాంత్ ఏం చేస్తున్నారు అనే విషయానికి వస్తే కనుక ఈయన ఇన్స్టాగ్రామ్ చూస్తేనే అర్థమవుతుంది. తిరిగి తన సొంత ఊరిలో పొలం పనులు ప్రారంభించారని చెప్పాలి. అయితే ఈయన మాత్రం బిగ్ బాస్ తర్వాత సెలబ్రిటీ హోదాని అలాగే మైంటైన్ చేస్తున్నారని తెలుస్తుంది. ఖరీదైన కార్లలో చాలా రిచ్ గా బయట తిరుగుతూ ఉన్నారు. ఇక ఈయన ఎక్కడికి వెళ్ళినా అభిమానులు పెద్ద ఎత్తున చుట్టుముట్టి సెల్ఫీలు అంటూ ఎగబడుతున్నారు. మరోవైపు తన పొలంలో తన తల్లిదండ్రులతో కలిసి రీల్స్ చేస్తూ వాటిని సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఇలా బుల్లితెరకు దూరమైనా కానీ ఈయన మాత్రం సెలబ్రిటీ హోదాని అనుభవిస్తున్నారని తెలుస్తోంది.

Read More: ప్రభాస్ కి ఈ అలవాటు కూడా ఉందా.. అర్ధరాత్రి వరకు అలాంటి పనులు చేస్తారా?

ట్రెండింగ్ వార్తలు