నన్ను సీఎంను చేయండి.. రైతుల కష్టాలను తీరుస్తా పల్లవి ప్రశాంత్ సెన్సేషనల్ కామెంట్స్?

March 18, 2024

నన్ను సీఎంను చేయండి.. రైతుల కష్టాలను తీరుస్తా పల్లవి ప్రశాంత్ సెన్సేషనల్ కామెంట్స్?

సోషల్ మీడియా ద్వారా ఎంతో మంది సెలెబ్రెటీలుగా మారిన సంగతి మనకు తెలిసిందే.ఈ క్రమంలోనే ఒక రైతు బిడ్డగా పొలం పనులు చేసుకుంటూ, రైతులు పడే కష్టాలను వీడియోల రూపంలో చిత్రీకరించి, వాటిని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ యూటూబ్ గా ఎంతో ఫేమస్ అయ్యారు పల్లవి ప్రశాంత్. ఈయన యూట్యూబర్ గా ఎన్నో రకాల వీడియోలను చేసుకుంటూ తనకు బిగ్ బాస్ లో అవకాశం కల్పించాలని వేడుకున్నారు.

ఇలా ఈయన అనుకున్న విధంగానే బిగ్ బాస్ కార్యక్రమంలోకి వెళ్లారు. ఒక కామన్ మ్యాన్ గా, రైతు బిడ్డగా బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లినటువంటి ప్రశాంత్ పులిలా ఆట ఆడుతూ అందరి దృష్టిని ఆకర్షించారు. ఇలా కామన్ మ్యాన్ గా సెలబ్రిటీలను సైతం వెనక్కి నెట్టి విన్నర్గా నిలిచి బయటకు వచ్చారు. ఇక ప్రశాంత్ విన్నర్ గా నిలిచారన్న ఆనందం కొంతకాలం పాటు కూడా లేకుండా పోయింది. ఈయన అభిమానులు చూపిన అత్యుత్సాహం కారణంగా జైలుకు వెళ్లి వచ్చారు.

అనంతరం బిగ్ బాస్ ద్వారా గెలుచుకున్న డబ్బు రైతులకు పంచుతానని చెప్పి మాట మార్చారని ఈయన పట్ల చాలామంది రూల్స్ కూడా చేశారు అయితే ఈ ట్రోల్స్ అన్నింటిని ఖండిస్తూ ఇటీవల ఓ కుటుంబానికి లక్ష రూపాయలు సహాయం ఏడాదికి సరిపడా బియ్యం కూడా సహాయం చేశారు. ఇకపోతే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈయన చేసినటువంటి కామెంట్స్ సంచలనంగా మారాయి.

నన్ను సీఎంని చేయండి నేను రైతులను ఆదుకుంటాను అంటూ ఈయన అభ్యర్థిస్తూ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. అయితే ఈయన తన గురించి వచ్చిన ట్రోల్స్ కారణంగానే ఇలాంటి వ్యాఖ్యలు చేశారని తెలుస్తోంది. తనకు బిగ్ బాస్ కార్యక్రమంలో వచ్చింది కొంత అలాంటిది 14 గ్రామాల రైతులకు నేను సహాయం చేయాలంటే ఎలా కుదురుతుంది. ఇలా రైతులందరికీ సహాయం చేయాలి అంటే నన్ను సీఎం చేయండి అప్పుడే రైతులు బాగుపడతారు అంటూ పల్లవి ప్రశాంత్ చేసినటువంటి ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. నాకు బిగ్ బాస్ వారి నుంచి డబ్బులు రావడమే ఆలస్యంగా వచ్చాయి. దాంతో లేటుగా సహాయం చేశానని ఈ సందర్భంగా ప్రశాంత్ అసలు విషయం తెలిపారు.

Read More: మోక్షజ్ఞ భారం మొత్తం బోయపాటి పైనే పెట్టిన బాలయ్య?

ట్రెండింగ్ వార్తలు