February 14, 2022
Aadavaallu Meeku Johaarlu Shoot Wrapped Up: శర్వానంద్ నటిస్తోన్న ఔట్ అండ్ ఔట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ `ఆడవాళ్లు మీకు జోహార్లు` షూటింగ్ పూర్తయ్యింది. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు మేకర్స్. ఫిబ్రవరి 25న మహాశివరాత్రికి ఈ మూవీ రానుంది.
ఈ సందర్భంగా చిత్ర యూనిట్ విడుదల చేసిన కొత్త పోస్టర్లో శర్వానంద్ తన ఆన్-స్క్రీన్ భార్యకు నమస్కరిస్తున్నట్లు కనిపిస్తోంది. రష్మిక మందన్నతో పాటు ఇతర ప్రధాన తారాగణం అందరూ ఈ పోస్టర్లో కనిపిస్తున్నారు. ఈ పోస్టర్ ఈ సినిమా ఇతివృత్తాన్ని తెలియజేసేలా ఉంది.
టైటిల్తోనే ఈ మూవీ మీద పాజిటివ్ వైబ్స్ క్రియేట్ అయ్యాయి. పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమా అవ్వడంతో మరింత మంచి రెస్పాన్స్ వస్తోంది. వాలెంటెన్స్ డే కానుకగా దేవి శ్రీ ప్రసాద్ సమకూర్చిన పెప్పీ అండ్ బ్రీజీ మెలోడీ ఆద్య పాటను ఈ రోజు విడుదల చేయనున్నారు.
శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ సుధాకర్ చెరుకూరి ఈ ఫీల్ గుడ్ ఎంటర్ టైనర్ను నిర్మిస్తున్నారు.
కుష్బూ, రాధిక శరత్ కుమార్, ఊర్వశీ వంటి సీనియర్ యాక్టర్స్ కలిసి నటిస్తుండడం ఈ సినిమాలో మరో విశేషం.సుజిత్ సారంగ్ ఈ చిత్రానికి కెమెరామెన్గా, శ్రీకర్ ప్రసాద్ ఎడిటర్గా వ్యవహరిస్తున్నారు.