చీడ పురుగులు.. వాళ్లకి దూరంగా ఉండాలి.. గెలికిన అనసూయ

January 8, 2024

చీడ పురుగులు.. వాళ్లకి దూరంగా ఉండాలి.. గెలికిన అనసూయ

అనసూయ భరద్వాజ్ తరచూ ఏదో ఒక విషయం ద్వారా వార్తల్లో నిలుస్తూ ఉంటారు. అయితే ఈమె సోషల్ మీడియాలో తనకు తోచిన అంశాలను షేర్ చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే అవి కాస్త పలు వివాదాలకు కారణం అవుతూ ఉంటాయి. ఇకపోతే ఈ మధ్యకాలంలో ఈమె వివాదాలకు కాస్త దూరంగా ఉన్నారని చెప్పాలి అయితే తాజాగా ఇంస్టాగ్రామ్ వేదిక ఈమె అభిమానులతో ముచ్చటిస్తూ వారు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు.

ఈ సందర్భంగా అనసూయను ఒక నెటిజన్ ఏకంగా తనని ట్రోల్ చేసే వారి గురించి ఈమెకు ప్రశ్నలు ఎదురయ్యాయి మీ మీద ట్రోల్ చేసే వారికి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు అంటూ ఈమెకు ప్రశ్నలు ఎదురయ్యాయి. ఈ ప్రశ్నకు అనసూయ చెప్పినటువంటి సమాధానం ప్రస్తుతం వైరల్ గా మారింది. దీంతో మరోసారి ఈమె ట్రోలర్స్ ను గెలికినంత పని అయిందని చెప్పాలి.

అనసూయ ఈ ప్రశ్నకు సమాధానం చెబుతూ ట్రోలర్స్ అంటేనే చీడపురుగులు. ఆ చీడపురుగులకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని తెలుసుకున్నాను. ఆ కంపు నాకు అంట కూడదు కదా అందుకే ఆ చీడపురుగులకు ఏమి చెప్పి నేను టైం వేస్ట్ చేసుకోను అంటూ ఈమె ట్రోలర్స్ ని ఏకంగా చీడుపురుగులతో పోలుస్తూ సమాధానం చెప్పడంతో ఈ కామెంట్స్ కాస్త మరోసారి వైరల్ అయ్యాయి ఇక అనసూయ చేసినటువంటి ఈ కామెంట్స్ మరో వివాదానికి దారి తీసేలా ఉన్నాయని చెప్పాలి.

ఇలా తరచూ ఈమె ఏదో ఒక వివాదాస్పద పోస్టుల ద్వారానే వార్తల్లో నిలుస్తుంటారు. దీంతో యాంటీ ఫ్యాన్స్ ఈమెను భారీగా ట్రోల్ చేస్తుంటారు. ముఖ్యంగా విజయ్ దేవరకొండ అభిమానులకు అనసూయకు మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనే అంత విభేదాలు ఉంటాయని చెప్పాలి. ఈమె విజయ్ దేవరకొండను పరోక్షంగా టార్గెట్ చేయగా విజయ అభిమానులు మాత్రం డైరెక్ట్ గా ఈమెను టార్గెట్ చేసి ట్రోల్ చేస్తుంటారని చెప్పాలి.

Read More: అయాన్ పిల్ల చేష్టలు.. బాహుబలిలా ట్రై చేస్తున్న బన్నీ కొడుకు

ట్రెండింగ్ వార్తలు