January 27, 2024
జనతా గ్యారేజ్
వంటి బ్లాక్బస్టర్ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్లో వస్తోన్న మూవీ దేవర
. జాన్వీ కపూర్ హీరోయిన్. ఇప్పటికే 85శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఏప్రిల్ 5న విడుదల కావాల్సి ఉంది..కానీ అనుకున్న స్థాయిలో బిజినెస్ కాకపోవడం, వీఎఫ్ఎక్స్ పనులలో మరింత జాప్యం జరుగుతుండడంతో ఈ సినిమా విడుదల వాయిదా పడుతుందని ఇండస్ట్రీ సర్కిర్లో బలంగా వినపడుతోంది.
రెండు భాగాలుగా విడుదల కానున్న ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ దాదాపు 150 కోట్లకు నెట్ఫ్లిక్స్ సంస్థ కొనుగోలు చేసిందని తెలుస్తోంది. ఇక ఆడియో రైట్స్ని 27 కోట్లకు టీ-సిరీస్ దక్కించుకుంది. ప్రస్తుతం ఈ సినిమా నైజాం డిస్ట్రిబ్యూషన్ రైట్స్ కోసం వేంకటేశ్వర క్రియేషన్స్, మైత్రి మూవీస్ మధ్య టగ్ ఆఫ్ వార్ నడుస్తోంది. మొదటి భాగం 45-50కోట్ల రేంజిలో కోట్ చేస్తున్నారు.
తాజాగా ఈ మూవీ ఓవర్సిస్ రైట్స్కి ఓ ప్రముఖ సంస్థ(హంసిని ఎంటర్టైన్మెంట్స్ కావొచ్చు) 27 కోట్లకు దక్కించుకుంది. 2016లో వీరిద్దరి కాంబోలో వచ్చిన జనతా గ్యారేజ్
ఓవర్సిస్ రైట్స్ 2.5 మిలియన్స్కి అమ్ముడు పోయింది. అంటే దాదాపు 20 కోట్లకు అన్నమాట. ఈ ఏడెళ్లలో ఎన్టీఆర్ మార్కెట్ చాలా పెరిగింది కానీ కొరటాల తీసిన ఆచార్య భారీ నష్టాలు మిగల్చడంతో ఈ సినిమా బిజినెస్ అతి కష్టం మీద అవుతోందని టాక్. దేవర సినిమాని 200 కోట్ల భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు కళ్యాణ్రామ్, కె. హరి కృష్ణ, మిక్కిలినేని సుధాకర్. అనిరుధ్ రవిచంద్రన్ సంగీత దర్శకుడు.