January 19, 2024
సూపర్స్టార్ మహేశ్బాబు ప్రొఫెషనల్ లైఫ్తో పాటు వ్యక్తిగత జీవితానికి అంతే ప్రాధాన్యతనిస్తూ ఉంటారు. కాస్త గ్యాప్ దొరికినా ఫ్యామిలితో పాటు ఇతర దేశాలకు వెకేషన్స్కి వెళ్తూ ఉంటారు. రీసెంట్ గా న్యూ ఇయర్ ని ఫ్యామిలీతో కలిసి దుబాయ్ లో సెలబ్రేట్ చేసుకున్నారు. అయితే ప్రస్తుతం మహేశ్ జర్మనీలో ఉన్నారు..కాని వెళ్లింది మాత్రం వెకేషన్కి కాదు..
మహేశ్ బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో ఒక ప్రస్టేజియస్ ప్రాజెక్ట్ రూపొందనుంది. ఈ సినిమాకు సంబందించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా గతేడాదే మొదలైంది. ఫారెస్ట్ అడ్వెంచరస్ బ్యాక్డ్రాప్లో రూపొందే ఈ సినిమాలో మహేశ్ జేమ్స్ బాండ్ తరహా క్యారెక్టర్లో నటించనున్నాడని టాక్ వినిపిస్తోంది. ఈ పాత్ర సాంకేతికత పరంగా చాలా అడ్వాన్స్డ్గా ఉండనుంది. దాని కోసమో మహేశ్ జర్మనీ వెళ్లారని ఫిలిం నగర్ సర్కిల్లో లేటెస్ట్ టాక్..మరి ఇదే నిజమైతే మహేశ్ బాబు ఫ్యాన్స్ ఆనందానికి అవదులుండవు..
ఈ సినిమాకు విజయేంద్ర ప్రసాద్ కథ, ఎమ్ఎమ్ కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఈ ఏడాదిలోనే షూటింగ్ ప్రారంభం కానుంది. హాలీవుడ్ యాక్టర్స్ ఈ సినిమాలో భాగమైయ్యేలా ఫారిన్ యాక్టింగ్ ఏజెన్సీలతో రాజమౌళి ఒప్పందం చేసుకున్న సంగతి తెలిసిందే.
Read More: ఫిలిం ఛాంబర్ మాట నిలబెట్టుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం – పీపుల్ మీడియా ఫ్యాక్టరీ