జూన్ లో రాబోతున్న రామ్ పోతినేని డబుల్ ఇస్మార్ట్?

March 25, 2024

జూన్ లో రాబోతున్న రామ్ పోతినేని డబుల్ ఇస్మార్ట్?

టాలీవుడ్ ఇండస్ట్రీలో డేరింగ్ అండ్ డాష్ అండ్ డైరెక్టర్ గా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి వారిలో దర్శకుడు పూరీ జగన్నాథ్ ఒకరు. ఈయన దర్శకుడిగా ఎన్నో అద్భుతమైన సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. ఇకపోతే హీరో రామ్ తో ఇస్మార్ట్ శంకర్ సినిమాని తెరకెక్కించిన సంగతి తెలిసిందే. పూరి నిర్మాణంలోనే తెరకెక్కిన ఈ సినిమా ఎంతో అద్భుతమైనటువంటి విజయాన్ని సొంతం చేసుకుంది.

ఇక ఈ సినిమా తర్వాత పూరి జగన్నాథ్ లైగర్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో అత్యంత భారీ బడ్జెట్ సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ ఈ సినిమా మాత్రం డిజాస్టర్ గా నిలిచిపోయింది. ఈ సినిమా డిజాస్టర్ కావడంతో పూరి జగన్నాథ్ ఇస్మార్ట్ శంకర్ సినిమాకు సీక్వెల్ చిత్రంగా డబల్ ఇస్మార్ట్ అనే సినిమా ద్వారా మరోసారి ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు.

ఈ సినిమా శరవేగంగా షూటింగ్ పనులను జరుపుకుంటుంది. ఈ సినిమా చివరి షెడ్యూల్ చిత్రీకరణ త్వరలోనే ప్రారంభం కానుంది అయితే ఈ సినిమాని ఇది వరకు వేసవి సెలవుల్లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని భావించారు కానీ ఈ సినిమా విడుదల వాయిదా పడబోతుందని తెలుస్తుంది త్వరలోనే రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ఈ సినిమాని వేసవి సెలవుల్లో కాకుండా జూన్ నెలలో విడుదల చేయాలని పూరి భావించారని తెలుస్తోంది.

ఈ క్రమంలోనే త్వరలోనే చివరి షెడ్యూల్ చిత్రీకరణ పూర్తి చేసుకున్నప్పటికీ ఈ సినిమాని జూన్ నెలలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సిద్ధమవుతున్నారు. ఇక ఇందులో హీరోయిన్ గా కావ్య థాపర్ నటించగా ఈ సినిమాకు మని శర్మ సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు.

Read More: ఓటీటీ తెలుగులోకి వచ్చేసిన ఆస్కార్ విన్నింగ్ మూవీ ఓపెన్ హైమర్!

ట్రెండింగ్ వార్తలు