బిగ్ బాస్ కార్యక్రమానికి వెళ్లాలన్న వెళ్లలేము.. హైపర్ ఆది కామెంట్స్ వైరల్!

February 16, 2024

బిగ్ బాస్ కార్యక్రమానికి వెళ్లాలన్న వెళ్లలేము.. హైపర్ ఆది కామెంట్స్ వైరల్!

బుల్లితెరపై ప్రసారమయ్యే అతిపెద్ద రియాలిటీ షో బిగ్ బాస్ కార్యక్రమం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు ఈ కార్యక్రమం ఎంతో మందినీ సెలబ్రిటీలను చేయగా మరికొందరు ఉన్న పాపులారిటీని కాస్త ఈ కార్యక్రమానికి వచ్చి పోగొట్టుకున్నారు. అయితే గతంలో ఈ కార్యక్రమంలో హైపర్ ఆది రష్మీ సుధీర్ వంటి స్టార్ బుల్లితెర సెలబ్రిటీలో పాల్గొనబోతున్నారంటూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి కానీ ఇప్పటివరకు వీరందరూ కూడా బిగ్ బాస్ కార్యక్రమంలో పాల్గొన్న దాఖలాలు కూడా లేవు.

అయితే ఈ సెలబ్రిటీలందరూ కూడా బిగ్ బాస్ కార్యక్రమానికి రాలేకపోవడానికి గల కారణం ఏంటి అనే విషయాలను ఇటీవల హైపర్ ఆది వెల్లడించారు. మాకు అందరిలాగే బిగ్ బాస్ కార్యక్రమంలో పాల్గొనాలని ఉంటుంది కానీ మేము వెళ్లలేని పరిస్థితి అంటూ ఆది తెలిపారు. మేము ఈ టీవీలో కార్యక్రమాలు చేయడం కోసమే అగ్రిమెంట్ చేసుకుని ఉన్నాము అందుకే ఇతర ఛానల్లో ఏ కార్యక్రమాలకు హాజరు కాకూడదని అగ్రిమెంట్ లో ఉంటుంది. అందుకే మేము బిగ్ బాస్ కార్యక్రమంలో పాల్గొనలేము అంటూ ఈయన తెలిపారు.

ఈటీవీలో కార్యక్రమాలకు అగ్రిమెంట్ ఇచ్చిన తర్వాత ఇతర చానల్లో ఒకటి రెండు ఎపిసోడ్స్ చేసుకోవచ్చు కానీ పూర్తిస్థాయిలో కార్యక్రమాలకు వెళ్లాలి అంటే అలా కుదరదని ఇక సినిమాలు కూడా చేసుకునే వెసులుబాటు ఉంటుందని హైపర్ ఆది తెలిపారు. ఇలా ఒకసారి అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసుకున్న తర్వాత తిరిగి ఆ ఛానల్ కు వెళ్లడానికి కుదరదు కనుక మేము బిగ్ బాస్ కార్యక్రమానికి వెళ్లలేమని తెలిపారు. గతంలో అవినాష్ చలాకి చంటి వారందరూ కూడా వారి అగ్రిమెంట్ బ్రేక్ చేసుకుని బిగ్ బాస్ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ముక్కు అవినాష్ బిగ్ బాస్ కార్యక్రమంలోకి వెళ్లాలనుకున్న సమయంలో ఆయన జబర్దస్త్ కార్యక్రమంలో కమెడియన్ గా ఉన్నారు ఇలా తన అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసి బిగ్ బాస్ వెళ్లడానికి పర్మిషన్ లేదు అయితే ఆయన వెళ్లడంతో పది లక్షల రూపాయల జరిమానా చెల్లించాల్సి వచ్చిన సంగతి మనకు తెలిసిందే. బిగ్ బాస్ వెళ్లిన తర్వాత అవినాష్ ఫైమా చంటి వీరందరూ కూడా ఈటీవీ షోలలో కనిపించలేదు.

Read More: నా భర్తతో గొడవలు ఉండటం వాస్తవమే.. విడాకుల వార్తలు నిజమేనా?

ట్రెండింగ్ వార్తలు