పుష్పరాజ్ ముఖ్య అతిథిగా అఖండ ప్రీ రిలీజ్ ఈవెంట్
November 25, 2021
నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్లో రాబోతున్న అఖండ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నవంబర్ 27న హైదరాబాద్లోని శిల్పా కళా వేదికలో జరగబోతోంది. ఈ ఈవెంట్కు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా రాబోతున్నారు. బాలకృష్ణతో అల్లు అర్జున్కు మంచి సాన్నిహిత్యం ఉంది. అంతే కాకుండా బోయపాటి శ్రీను-అల్లు అర్జున్ కాంబినేషన్లో సరైనోడు వంటి హిట్ సినిమా వచ్చింది. ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్. ఈ చిత్రం డిసెంబర్ 2న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.